మృత్యువు ఎప్పుడు ఎటు నుంచి వచ్చి కబలిస్తుంది అన్నది ఊహకందని విధంగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అంత సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో ఊహించని విధంగా మృత్యువు కబళించింది కుటుంబాల్లో విషాదాన్ని నింపుతూ ఉంటుంది ఎంతోమందికి ప్రియమైన వారిని దూరం చేస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు సంతోషంగా ఉన్న సమయంలో విధి వక్రించి మృత్యువు దరిచేరే  అవకాశం కూడా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది.


 ఇటీవలే అమలాపురం లో ఒకేసారి ముగ్గురు యువకులు అదృశ్యమైన ఘటన కలకలం సృష్టించింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసినప్పటికీ ఎలాంటి ఆధారాలు లభించలేదు. అయితే ఇటీవలే.. ముగ్గురు యువకులు కూడా గోదావరిలో శవమై తేలినట్లు  తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే..  అమలాపురం రూరల్ మండలం శెట్టి పేటకు  చెందిన ప్రేమ్ సాగర్, బాల వెంకటరమణ,  ఫణి కుమార్ ముగ్గురు స్నేహితులు. ఇటీవలే ముగ్గురు కలిసి.. గేదెలంక ఉత్తర వాహిని పుష్కరాల రేవు వద్దకు స్నానాలకు వెళ్లారు.



 ఈ క్రమంలోనే నదిలో ఈత కొడుతూ సరదాగా గడిపారు. కానీ అంతలోనే గల్లంతయ్యారు ముగ్గురు యువకులు. యువకులు కనిపించకపోవడంతో అమలాపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో బంధువులు ఫిర్యాదు చేయగా..  పోలీసులు వారి ఆచూకీ కోసం ఎంత గాలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ  క్రమంలోనే గోదావరిలో యువకుడు శవమై తేలాడు. యువకుడు ఫోన్ నెంబర్ కు కాల్ చేయగా  ఒక పశువుల కాపరి ఫోన్ ఎత్తాడు. గోదావరి పుష్కరి వద్ద  దుస్తులు ఫోను ఉన్నాయని నదిలో  శవం కూడా కనిపిస్తుంది అని చెప్పడంతో అప్రమత్తమైన పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి చూడగా అక్కడ ఒక యువకుడు శవం  లభ్యమైంది.  గజ ఈతగాళ్లు తో గాలించగా  మరో రెండు మృతదేహాలు  కూడా లభ్యమయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: