గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి గెలిచి వైసీపీ చెంత చేరిన గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీకి ఏపీ సీఎం జ‌గ‌న్ అగ్నిప‌రీక్ష పెట్టారు. ఆయ‌న ఇప్పుడు జ‌గ‌న్‌తో స‌న్నిహితంగా ఉంటున్నారు. గ‌న్న‌వ‌రం పార్టీ బాధ్య‌తలు కూడా జ‌గ‌న్ ప‌రోక్షంగా వంశీ చేతుల్లో పెట్టేశారు. యార్ల‌గ‌డ్డ‌కు కృష్ణా డీసీసీబీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చి ఆయ‌న్ను గ‌న్న‌వ‌రంలో సైలెంట్ చేసేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు వంశీకి సీఎం జ‌గ‌న్ స్వ‌యంగా ఓ పరీక్ష పెట్టిన‌ట్టు తెలిసింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో వైసీపీ అభ్యర్ధులను గెలిపించే బాధ్యత వల్లభనేని వంశీ మీద కూడా పెట్టార‌ట‌.

గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం విజ‌యవాడ ప‌రిధిలో లేక‌పోయినా ఆ నియోజ‌క‌వ‌ర్గం విజ‌య‌వాడ‌ను ఆనుకునే ఉంటుంది. వంశీ రాజ‌కీయం కూడా విజ‌య‌వాడ నుంచే జ‌రుగుతుంది. ఇక విజ‌య‌వాడ‌లో క‌మ్మ వ‌ర్గం ఎక్కువుగా ఉంటోంది. ఈ క్ర‌మంలోనే క‌మ్మ‌ల్లో మెజార్టీ యువ‌త‌తో పాటు ఇత‌ర వ‌ర్గాల‌ను వైసీపీ వెపు మళ్లించి బెజ‌వాడ కార్పొరేష‌న్లో వైసీపీ పాగా వేసేలా చేయ‌డంలో వంశీ కీ రోల్ పోషించాల‌ని జ‌గ‌న్ ఆదేశాలు జారీ చేశార‌ట‌. ఇప్పటికే ఈ ఎన్నిక‌ల్లో ఇద్దరు మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్ కొడాలి నాని రంగంలోకి దిగేశారు.

వెల్లంపల్లి, మ‌ల్లాది విష్ణు ఇక్క‌డ ఎమ్మెల్యేలుగా ఉన్నా వారు న‌గ‌రం అంతా ప్ర‌భావం చూపే మాస్ లీడ‌ర్లు కారు... అందుకే వంశీ ని యువ‌త‌తో పాటు క‌మ్మ వ‌ర్గం ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేలా పార్టీ అధిష్టానం నేరుగా రంగంలోకి దిగింద‌ని అంటున్నారు. ఈ విష‌యంలో వంశీ స‌క్సెస్ అయితే జ‌గ‌న్ ద‌గ్గ‌ర ఆయ‌న కు మ‌రింత క్రేజ్ పెరుగుతుంది అన‌డంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: