గన్నవరం నియోజకవర్గం విజయవాడ పరిధిలో లేకపోయినా ఆ నియోజకవర్గం విజయవాడను ఆనుకునే ఉంటుంది. వంశీ రాజకీయం కూడా విజయవాడ నుంచే జరుగుతుంది. ఇక విజయవాడలో కమ్మ వర్గం ఎక్కువుగా ఉంటోంది. ఈ క్రమంలోనే కమ్మల్లో మెజార్టీ యువతతో పాటు ఇతర వర్గాలను వైసీపీ వెపు మళ్లించి బెజవాడ కార్పొరేషన్లో వైసీపీ పాగా వేసేలా చేయడంలో వంశీ కీ రోల్ పోషించాలని జగన్ ఆదేశాలు జారీ చేశారట. ఇప్పటికే ఈ ఎన్నికల్లో ఇద్దరు మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్ కొడాలి నాని రంగంలోకి దిగేశారు.
వెల్లంపల్లి, మల్లాది విష్ణు ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్నా వారు నగరం అంతా ప్రభావం చూపే మాస్ లీడర్లు కారు... అందుకే వంశీ ని యువతతో పాటు కమ్మ వర్గం ఓటర్లను ఆకర్షించేలా పార్టీ అధిష్టానం నేరుగా రంగంలోకి దిగిందని అంటున్నారు. ఈ విషయంలో వంశీ సక్సెస్ అయితే జగన్ దగ్గర ఆయన కు మరింత క్రేజ్ పెరుగుతుంది అనడంలో సందేహం లేదు.