న్యాయవాదులను అక్కడి నుంచి పోలీసులు పంపించివేసిన తరువాత చంద్రబాబు రోడ్ షో కొనసాగింది.
చంద్రబాబు రోడ్ షోను అడ్డుకునేందుకు ప్రయత్నించడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ డైరెక్షన్ లోనే... కొంత మంది లాయర్లు చంద్రబాబు ప్రచారంలో అలజడి స్పష్టించారని ఆరోపించారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ నేతలు ఇలాంటి చర్యలకు దిగుతున్నారని కర్నూల్ టీడీపీ నేతలు మండిపడ్డారు.
కర్నూలులో ప్రచారంలో సీఎం జగన్ పాలనపై నిప్పులు చెరిగారు. జగన్ పిరికి పంద అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్కు దమ్ముంటే తన విమర్శలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో దోషి ఎవరో ప్రజలకు తెలుసన్నారు. వైసీపీ పాలనలో పూర్తిగా మత సామరస్యం దెబ్బతిందని.. ఆలయాలపై దాడులు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీలో ఏబీసీడీ పాలన సాగుతోందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఏ అంటే అట్రాసిటీ, ఆటవిక పాలన అని, బీ అంటే బాదుడని.. సీ అవినీతి అని, డీ అంటే విధ్వంసంమని కొత్త అర్థం చేప్పారు.