డబ్బున్న రాష్ట్రాల పరిస్థితి వేరు మన పరిస్థితి వేరు అని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో చేసిన ఖర్చు కనిపించే లా లేదు అన్ని అసంపూర్తిగానే జరిగాయి అని ఆయన ఆరోపించారు. వ్యాపార సంస్థలు అన్ని ఆగిపోయాయి అని అన్నారు. కోవిడ్ వల్ల పరిస్థితి లో ఇబ్బంది ఉంది కనుకే ఎఫ్ ఆర్ బి ఎం లిమిట్ ను కేంద్రం కూడా 5 శాతానికి పెంచింది అని ఆయన అన్నారు. ఆదాయం లేకున్నా ప్రజల కొరకు ఖర్చు చేసి ఆదుకోవాలని సీఎం ఆదేశించారు అని ఆయన వివరించారు. ఇబ్బందులు వున్నప్పుడు డబ్బును పంపింగ్ చేస్తే అదే డబ్బులు ఎకానమీ లోకి వస్తుంది అని అన్నారు.
అందుకే అప్పు చేశామని తాము గర్వంగా చెపుతున్న అని ఆయన చెప్పుకొచ్చారు. 2020 లో రాబడి భారీగా పెరిగింది దానికి కారణం ప్రభుత్వం డబ్బు పంపింగ్ చేయడమే అని ఆయన అన్నారు. పన్నెతర ఆదాయం కూడా కోవిడ్ సమయం లో ఎక్కువ వచ్చింది అని ఆయన అన్నారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కూడా కేంద్రం నుండి తెచ్చుకోగలిగాము అని బుగ్గన మీడియాకు వివరించారు.