భారత్లో అందుబాటులోకి రానున్న బుల్లెట్ ట్రైన్స్పై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుల్లెట్ ట్రైన్ గుజరాత్కేనా.. హైదరాబాద్కు అర్హత లేదా అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏ ఒక్క రాజకీయ నేత అయినా ఎన్నికల కోసం కాకుండా ప్రజల కోసం, దేశం కోసం పని చేయాలని ప్రధాని మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు సంబంధించిన రైలు చిత్రాన్ని జపాన్ రాయబార కార్యాలయం మొదటి సారిగా విడుదల చేసింది. ముంబై-అహ్మదాబాద్ మధ్య నడువనున్న ఈ ఫైవ్ సిరీస్ సింకాన్సిన్ రైలింజన్ కొన్ని మార్పులు చేయనున్నట్లుగా అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.
ముంబై-అహ్మదాబాద్ల మధ్య 508కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్ట్ 2023నాటికల్లా పూర్తి చేయాల్సి ఉంది. సుమారు లక్షా ఎనిమిదివేల కోట్ల రూపాలయ ఈ ప్రాజెక్టుకు జపాన్ ప్రభుత్వ సాంకేతిక, ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి మహారాష్ట్రలోని ముంబై వరకు బుల్లెట్ ట్రైన్ కోసం ప్రత్యేకమైన మార్గం నిర్మించాల్సి ఉంది. అయితే మహారాష్ట్రలో భూ సేకరణ ఇంకా పూర్తి కాలేదు. దీంతో ప్రస్తుతం గుజరాత్ పరిధిలోని 325కిలోమీటర్ల మార్గంలోనే ఎల్ అండ్ టీ పనులు చేపట్టనుంది. మహారాష్ట్రలో భూసేకరణలో సమస్యలు ఉన్నందున దాంతో సంబంధం లేకుండా గుజరాత్లో పనులు ప్రారంభించాలని ప్రధాని మోదీ ఆదేశాలు ఇచ్చారు.