నిన్న మొన్నటి వరకు ఉన్న అంచనాల ప్రకారం రెండు , మూడు కార్పొరేషన్లు మినహా మిగిలిన అన్ని కార్పొరేషన్లో వైసిపి ఏకపక్షంగా విజయం సాధిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. తాజా సర్వేల ప్రకారం మొత్తం 12 కార్పొరేషన్లలో నూ వైసీపీ జెండా ఎగిరేలా ఉందని తెలుస్తోంది. విజయవాడ - గుంటూరు - వైజాగ్ లాంటి చోట్ల గట్టిపోటీ ఉన్నాకూడా వైసిపి ఎడ్జ్ లోకి వచ్చేసిందని తాజా సర్వేలు చెబుతున్నాయి.
విచిత్రమేంటంటే ఏలూరు - విశాఖపట్నం - విజయవాడ - గుంటూరు లాంటి కార్పొరేషన్లు మినహా మిగిలిన చోట్ల టిడిపి డబుల్ డిజిట్ కు చేరుకోవడం కూడా కష్టమని తాజా సర్వేలు చెబుతున్నాయి. మరి ఈ సర్వేల అంచనాలు ఎంత వరకు నిజమవుతాయి లేదా అన్నది ఈ నెల 14 వ తేదీ వరకు ఎదురు చూడాలి .