ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కేంద్రమైన కడప కార్పొరేషన్లో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. ఈ 50 డివిజన్లలో తెలుగుదేశం పార్టీ ఎన్ని డివిజన్లు గెలుచుకుంటుందన్న దానిపై ఇప్పటికే రెండు మూడు సర్వేలు చూడగా... ఈ మూడు సర్వేల్లోనూ టిడిపి రెండు కార్పొరేటర్ స్థానాలకు మించి గెలవదని తేలింది. ఒక సర్వే అయితే ఏకంగా వైసిపి 49 డివిజన్లు గెలుచుకుంటుందని.. ఆ ఒక్క డివిజన్ విషయంలోనూ గట్టి పోటీ ఉంటుందని చెప్పింది.
దీన్ని బట్టి చూస్తే రేపటి ఫలితాలు రోజున వైసిపి మొత్తం 50 డివిజన్లు వైసీపీ ఏకపక్షంగా గెలుచుకున్న ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అర్థమవుతోంది. కడప గడ్డపై ఒకే ఒక్క కార్పోరేటర్ స్థానాన్ని నిలబెట్టుకుంటేనే టీడీపీ సంచలనం నమోదు చేసినట్టే అనాలి. ఇక ఇదే జిల్లాలో పలు మున్సిపాలిటీ లోనూ టిడిపి తరఫున పోటీ చేసే కౌన్సిలర్ అభ్యర్థులు కూడా లేని దుస్థితిలో సైకిల్ పార్టీ ఉంది.