ఇకపోతే తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య భక్తుల దర్శనానికి అనుమతి నిషేధించారు. ఇటీవలే మళ్లీ దర్శనానికి అనుమతి కల్పించడంతో పాటు అటు దర్శనాల సంఖ్యను కూడా అంత కంతకు పెంచుకుంటూ పోతుంది టిటిడి బోర్డు అన్న విషయం తెలిసింది. అదే సమయంలో కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని పలు రకాల నిబంధనలు కూడా భక్తులకు విధిస్తుంది. ఈ క్రమంలోనే శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకునేందుకు కూడా అవకాశం కల్పిస్తూ ఇటీవలే టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది అన్న విషయం తెలిసిందే.
అయితే కరోనా వైరస్ కారణంగా ఎన్నో రోజుల నుంచి శ్రీవారి ఆర్జిత సేవ కు దూరమైన భక్తులందరూ కూడా ఇక ఇప్పుడు శ్రీవారి ఆర్జిత సేవ కోసం తో టికెట్లు బుక్ చేసుకునేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు బుక్ చేసుకునే భక్తులు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి అంటూ టీటీడీ బోర్డు తెలిపింది. ఆర్జిత సేవ టోకెన్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్న భక్తులు 72 గంటల ముందు కరోనా రిపోర్ట్ పూర్తి చేసుకుని నెగిటివ్ వచ్చినట్లుగా రిపోర్ట్ కలిగి ఉండాలి అంటూ సూచించింది. నెగిటివ్ రిపోర్ట్ వస్తేనే భక్తులను శ్రీవారి ఆర్జిత సేవలకు అనుమతిస్తాము అంటూ తేల్చి చెప్పారు టీటీడీ అధికారులు. ఇక ఏప్రిల్ 14 నుంచి శ్రీవారి ఆర్జిత సేవను ప్రారంభించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.