అంతే కాకుండా అధికార పార్టీ నేతలపై తనదైన శైలిలో తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఆదివారం విజయవాడలో రోడ్ షో లో పాల్గొన్న ఆయన..మరొక సారి సిఎం జగన్ పై అధికార పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి ని లక్ష్యంగా చేసుకొని ఘాటు వ్యాఖ్యలు చేశారు చంద్ర బాబు.. ‘‘రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి.. ఈ జిల్లాకు ఇన్చార్జ్ కూడా.. పెద్ద రౌడీ అనుకుంటున్నాడు.. నేను రౌడీలకే రౌడీని అంటూ చంద్ర బాబు రెచ్చిపోయారు.
అంతే కాకుండా నీ గుండెల్లో నిద్రపోతా..అంటూ తన వ్యాఖ్యలలో ఘాటు పెంచారు..నాతో ప్రజలు ఉన్నారు..నీతో రౌడీలు ఉన్నారు ప్రజలు తిరగబడితే... నీ రౌడీలు పారిపోవడం ఖాయం. బట్టలిప్పించడం ఖాయం అంటూ చంద్ర బాబు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు..వైసీపీ నాయకులకు సిగ్గు.. ఎగ్గు, మానం ఏమీ లేవని, అన్నిటినీ వదిలేశారని అన్నారు. విసిపి నాయకులు దౌర్జన్యాలు చేసి గెలవాలనుకుంటున్నారని చంద్ర బాబు ద్వజమెత్తారు. అసలు ప్రతిపక్షం లేకపోతే... అడిగేవాడు లేకపోతే..వైసీపీ ప్రభుత్వ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయెదని చంద్ర బాబు అన్నారు. వైసీపీ నేత విజయసాయి రెడ్డి... విశాఖకు శనిలా పట్టాడు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి చంద్ర బాబు వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.