మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు, లోకేశ్‌ జోరుగా ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు విజయవాడలో పర్యటిస్తూ వైసీపీ పాలనను తీవ్రంగా విమర్శించారు. దుర్గ గుడిలో అవినీతి కంపు కొడుతోందని మండిపడ్డారు. వైసీపీ నాయకులు దుర్గమ్మను కూడా వదలడం లేదని మండిపడ్డారు. అయితే.. దీనికి కూడా వైసీపీ గట్టి కౌంటర్ ఇస్తోంది. అసలు దుర్గ గుడిని చంద్రబాబు హయాంలో భ్రష్టు పట్టించారని వైసీపీ నేతలు అంటున్నారు.

చంద్రబాబు అమ్మవారితో పెట్టుకున్నారు కాబట్టే ఈ పరిస్దితి వచ్చిందని.. దుర్గ గుడిలో అర్దరాత్రి పూట క్షద్ర పూజలు చేసి ఆగ్రహానికి గురై చంద్రబాబుకు శాస్తి చేసిందని అంటున్నారు. చంద్రబాబు ఇప్పటికైనా స్వచ్చమైన రాజకీయాలు చేయాలని కోరుతున్నారు. ఇక బెజవాడ కొండ వద్ద కొబ్బరి చిప్పలు, సైకిల్ డిప్పలు ఎత్తివేసినోన్ని పక్కన పెట్టుకుని చంద్రబాబు మాట్లాడుతున్నారని.. మట్టి, గ్లాసుడు నీళ్లు తీసుకురావడం తప్పఅమరావతికి చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు.

అసలు అమరావతిలో కాకుండా బెజవాడలోనో, గుంటూరు లోనో అదే రాజధానిని కట్టి ఉంటే ఎంతో బాగుండేదని... అమరావతితో పాటు బెజవాడను సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు.. బెజవాడలో ఒక్క బైపాస్ రోడ్డు, వంతెన నైనా చంద్రబాబు నిర్మించారా.. ఒక్క పరిశ్రమలు, ఐటీ పరిశ్రమనైనా బెజవాడలో ఏర్పాటు చేశారా అన్ని ప్రశ్నిస్తున్నారు. అమరావతిలో 54 వేలమంది నిరుపేదలకు నివాసం కల్పిస్తామంటే కుట్రలతో స్టేలు తెప్పించారని... అమరావతి ప్రజలు గత ఎన్నికల్లో మిమ్మల్ని ఎందుకు ఓడించారో తెలుసుకోవాలని సూచిస్తున్నారు.


చంద్రబాబుకు ఇంకా జ్ఞానం కలగడం లేదని.. అమరావతిలో చంద్రబాబు, ఆయన అనుచరులు వేల ఎకరాలు దోచుకున్న సంగతి ప్రజలందరికీ తెలుసని వైసీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబు కు తెలిసిందంతా ప్రజలను మోసం చేయడమేనని .. సంక్షేమ పథకాలపై ఏమీ మాట్లడలేకే చంద్రబాబు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారు.మొత్తానికి చంద్రబాబు వైసీపీని తిట్టి మరీ తిట్టించు కుంటున్నారేమో అనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: