విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోవాలంటే.. అన్ని పార్టీలు కలిసి పోరాటం చేయాలని.. ఈ విషయంలో సీఎం జగన్ వెంట నడిచేందుకు తాము సిద్ధమన్నారు. వాలంటీర్లు పోలీసులు ద్వారా ప్రజలను, అభ్యర్థులను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సోమువీర్రాజు పొరుపాటున బయట ఉన్నారు.. ఆయన పిచ్చాసుపత్రిలో ఉండాల్సిందని అయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటు వేసే హక్కు అంబేద్కర్ ఇస్తే దాన్ని కూడా వేయకుండా జగన్ ఓటర్లపై దౌర్జన్యం చేస్తున్నాడని నారాయణ ఆరోపించారు.
ఎన్నికలు జరగకుండా నామినేట్ చేసే పద్ధతులు చేసుకోవాలని సీఎం జగన్ కు నారాయణ సలహా ఇచ్చారు. పెట్రోల్ పై కేంద్ర ప్రభుత్వానికి 20 లక్షల కోట్లు ఆదాయం వస్తే దాన్ని ఏం చేశారో తెలియదు మళ్లీ మళ్లీ పెట్రో బాదుడు బాదుతున్నారని విమర్శించారు.మోడీ ప్రైవేట్ సెక్టారుకు అమ్మేస్తుంటే ఎదిరించే సత్తా లేని జగన్ వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికలు రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా ఉన్నాయని ఆయన విమర్శించారు.