పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భాగల్పూర్లో నీరు యాదవ్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతని 13 ఏళ్ల కుమారుడు హరియోమ్ యాదవ్ తీర్థంగ గ్రామం వద్ద పడవలో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయాడు. ఆ తరువాత అతను కనిపించలేదు. ఈ విషయంపై నీరు యాదవ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
తరువాత, కరీహార్లోని కుర్సోల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఉన్న ఖేరియా నది సమీపంలో హరియోమ్ యాదవ్ మృతదేహం లభ్యమైంది. డెడ్బాడీ గురించి నీరు యాదవ్కు సమాచారం ఇచ్చారు పోలీసులు. అతను సంఘటన స్థలానికి చేరుకుని చూడగా మృతదేహం గుర్తుపట్టలేనివిధంగా మారిపోయింది. జంతువులు అతని మృతదేహాన్ని పీక్కుతిన్నాయి. అయితే, వేసుకున్న బట్టలతో పాటు ఇతర శరీర భాగాల ఆధారంగా మృతదేహం తన కుమారుడిదే అని గుర్తించాడు నీరు యాదవ్.
అయితే ఆశ్చర్యకరంగా, ఈ విషయంలో భారుపూర్ పోలీసులు కానీ, కతిహార్ పోలీసులు నీరు యాదవ్ కనీసం మానవం చూపలేదు. మృతదేేహాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్ కూడా అందించలేదు. దీంతో చేసేదేం లేక నీరు యాదవ్ కొడుకు మృతదేహాన్ని ఒక గోనె సంచిలో వేసి.. సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటివరకు నడుచుకుంటూ వెళ్లాడు. “ఎవరూ నాకు సహాయం చేయలేదు, కనీసం సానుభూతి చూపలేదు” అని నీరు యాదవ్ చెప్పారు. ఈ సంఘటన మరోసారి ‘మానవత్వం’ పై ప్రపంచానికి ప్రశ్నలు సంధించింది.