ఎన్నికలు వస్తే చాలు నేతలు అందరూ ఎక్కడా లేని విధంగా వాగ్దాలను చేస్తారు. ఒకవేళ వాళ్ళు గెలిస్తే మాత్రం ఎటువంటి అభివృద్ది చేయక పోగా ప్రజల సొమ్మును కొల్ల గొడుతున్నారు. ఇప్పుడు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు తమిళ నాడులో ఎన్నికల ప్రచారం జోరు కొనసాగుతోంది. ఎవరికీ వాళ్ళే అన్నట్లు అయిపోయింది.


అన్ని పార్టీల నేతలు ప్రచారం లో దూసుకెళ్తున్నారు. జాతీయ పార్టీల అగ్ర నేతలు తమిళనాడు లో సందడి చేస్తున్నారు. ఈ క్రమం లో ఎన్నికల వేళ ఓటర్లపై వరాల జల్లు కురుస్తోంది. జనాలను ఆకర్షించేందుకు ఎవరికీ వారు హామీలు ఇస్తున్నారు. ఆదివారం తిరుచ్చిలో పర్యటించిన డీఎంకే నేత స్టాలిన్ ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నారు. ఆ ప్రచార సభకు భారీగా జనం తరలివచ్చారు. ఈ సందర్భంగా మహిళలకు ఓ వరం ప్రకటించారు స్టాలిన్. డీఎంకే అధికారం లోకి వస్తే రేషన్  కార్డున్న ప్రతి గృహిణికి రూ. వెయ్యి ఇస్తామని చెప్పారు


తమిళనాడు లో ప్రస్తుతం అధికారం లో ఉన్న అన్నాడీఎంకే, బీజేపీ కలిసి పోటీచేస్తున్నాయి..మొత్తం 234 సీట్లు ఉన్నాయి. ఇందులో బీజేపీకి 20 సీట్లు కేటాయించింది అన్నాడీఎంకే. కన్యాకుమారి లోక్‌సభ సీటును కూడా కాషాయ దళానికి అప్పగించింది. మరికొన్ని సీట్లను ఇతర మిత్ర పక్షాలకు ఇచ్చింది అన్నాడీఎంకే. మిగతా సీట్లలో అన్నాడీఎంకే పోటీచేయబోతోంది. ఇక కాంగ్రెస్-డీఎంకే కూటమిలో.. కాంగ్రెస్ 25 సీట్లలతో పాటు కన్యాకుమారి లోక్‌సభలోనూ పోటీచేస్తోంది. డీఎంకే 180 సీట్లలో బరిలోకి దిగుతోంది.. ఏప్రిల్ 6న ఒకేదశలో ఎన్నికలు జరగనున్నాయి. 38 జిల్లాల్లోని 234 నియోజక వర్గాల్లో పోలింగ్ జరగనుంది. కేరళ, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అసోంతో పాటు తమిళనాడు ఎన్నికల ఫలితాలు కూడామే2న ప్రకటిస్తారు. ఎంటో ఎక్కడ చూసిన ఎన్నికల పోరు  ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: