ఖమ్మంలో వైఎస్సార్ విగ్రహ ధ్వంసం ఘటనను ఖండిస్తూ ధర్నా చేపట్టారు. రాజకీయంగా ఎదుర్కొలేకే ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఒక్క విగ్రహాన్ని ధ్వంసం చేస్తే.. తెలంగాణ వ్యాప్తంగా వేలాది విగ్రహాలు ఏర్పాటు చేసే అభిమానులు వైఎస్ సొంతమని చెప్పారు. విగ్రహం ధ్వంసం చేసిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కూల్చివేసిన చోటే మళ్లీ వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ అభిమానులు శివాయిగుడెం చేరుకుంటారని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఏప్రిల్ 9 న సభ పెట్టి తీరుతామని.. విజయవంతం చేస్తామని చెప్పారు. మరోసారి ఇటువంటి ఘటనలకు పాల్పడితే వైఎస్ అభిమానులుగా తాటతీస్తామంటూ కాస్త ఘాటుగానే స్పందించారు
వచ్చే నెలలో ఖమ్మం జిల్లాలో వైఎస్ షర్మిల బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో విగ్రహ ధ్వంసం ఘటన కలకలం రేపింది. దుండగులు ధ్వంసం చేసిన విగ్రహాన్ని 2013లో వైఎస్ షర్మిల ఆవిష్కరించారు. షర్మిల ఆవిష్కరించిన విగ్రహాన్ని ధ్వంసం చేయడం చర్చనీయాంశమైంది. అప్పటి వైసీపీ నాయకులు పువ్వాడ అజయ్కుమార్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్లు కూడా శిలాఫలకంలో ఉన్నాయి. ఇదిలా ఉండగా తెలంగాణ రాజకీయాల్లో షర్మిల ఇంకా పూర్తిస్థాయిలో అడుగు పెట్టకముందే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.