కరోనా వారియర్స్ కు సత్కారం చేసారు. మహిళలకు మోదీ ప్రభుత్వం ఎంతో మేలు చేస్తోంది అని వారు అన్నారు. ఎక్కడ మంచి జరిగినా అక్కడ బీజేపీ ఉంటోంది అని విజయశాంతి చెప్పుకొచ్చారు. సమాజంలో చెడుని కూడా క్లీన్ చేయాలి (పారిశుద్ధ్య కార్మికుల నుద్దేశించి) అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరటంలేదు అని వ్యాఖ్యానించారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు మేలు జరుగుతుంది అని విజయశాంతి ఆకాంక్షించారు.
విజయశాంతికి, కార్మికులకు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. మాస్క్ తీయమని పారిశుద్య కార్మికులు అడిగారు. విజయశాంతినా? కాదా పోల్చుకుంటామన్న కార్మికులు... మాస్క్ తీసి ఇప్పుడు ఒకేనా అని అడిగిన విజయశాంతికి .. ఓకే అని సమాధానం ఇచ్చారు. దీనితో కాసేపు నవ్వులు పూసాయి. మీరంటే మాకు బాగా ఇష్టం అని వాళ్ళు చెప్పగా ధన్యవాదాలు చెప్పారు. రాములమ్మ సినిమా నాలుగు సార్లు చూశామన్న పారుశుద్య కార్మికులను... ఇంకా ఏయే సినిమాలు చూశారని అడిగారు విజయశాంతి.. చాలా సినిమాలు చూశామని కార్మికులు ఆమెకు సమాధానం ఇచ్చారు. మీ సినిమాలు చూస్తే ధైర్యం వస్తోందని విజయశాంతికి మున్సిపల్ కార్మికులు చెప్పారు. మిమ్మల్ని అక్క, చెల్లెలుగా భావిస్తామని విజయశాంతితో కరోనా వారియర్స్ చెప్పుకున్నారు. అందరితో కూడా కాసేపు రాములమ్మ ముచ్చటించారు.