వైఎస్ షర్మిల తెలంగాణ లో పార్టీ స్థాపనకై వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే యూత్ మీటింగ్ లు, మహిళలతో మీటింగ్ ఏర్పాటు చేసిన షర్మిల ఇప్పుడు సోషల్ మీడియాలోనూ అభిమానులను పెంచుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే షర్మిల కు ఒక ట్విట్టర్ అఫీషియల్ అకౌంట్, ఆమె టీమ్ పేరిట మరో అకౌంట్ ఉంది. కాగా ఆమె మరో అఫీషియల్ అకౌంట్ ను రియల్  వైఎస్ షర్మిల పేరుతో ఫిబ్రవరిలలో తెరిచారు. కాగా నేడు మార్చ్ 8 మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె తొలి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో షర్మిల " అన్నింటా మనం..అన్నింటా సగం..ప్రపంచ మహిళా దినోత్సవం సాక్షిగా ఇదే మన సంకల్పం" అని పేర్కొన్నారు. ఇక ఈ సందర్బంగా పోస్ట్ చేసిన ఫొటోలో షర్మిల రాణీ రుద్రమ లా కత్తి దూస్తున్నారు. అంతే కాకుండా బ్యాక్ గ్రౌండ్ లో చాకలి ఐలమ్మ  తో పాటు ఇతర నారిమణుల ఫోటోలు ఉన్నాయి. అంతే కాకుండా కాకతీయ కళాతోరణం ఫోటో కనిపిస్తోంది.

ఇక ఈ పోస్ట్ తో షర్మిల తెలంగాణ లో రాజకీయ సమరానికి సిద్ధమవుతున్నట్టు సంకేతాలు ఉన్నాయి. మరో వైపు ఈ ట్విట్టర్ ఖాతాలో కవర్  పేజీ, ప్రొఫైల్ ఫోటోలో రాజశేఖర్ రెడ్డి షర్మిల చేయెత్తి అభివాదం చేస్తుండగా.. వారి వెనక తెలంగాణ మ్యాప్ కనిపిస్తోంది. ఈ ఖాతాను ఇప్పటివరకు 689 మంది ఫాలో అవుతుండగా షర్మిల మాత్రం ఒక్కరంటే ఒక్కరిని కూడా ఫాలో అవ్వడం లేదు. తన అన్న జగన్ ను కూడా ఫాలో అవ్వడం లేదు. ఇక షర్మిల చేసిన పోస్ట్ కు వైసీపీ అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్స్ పెడుతున్నారు. కొందరు షర్మిల కు ఆల్ ద బెస్ట్ చెబుతుండగా..మరి కొందరు జగన్ అన్న ఫోటోలు పోస్టర్ లలో ఎందుకు వేయడం లేదక్కా అంటూ ప్రశ్నలు వేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: