మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు చెప్పారు ఆమె. ఫ్రీ బస్ లు ఏర్పాటు చేసి ,మహిళలు సురక్షితంగా ఇంటికి వెళ్ళే ల చూస్తాం అని ఆమె చెప్పుకొచ్చారు. అమ్మఒడి, పథకాలు కోసం గత ప్రభుత్వం పెట్టిన పథకాలు మొత్తం తీసేసారు అని ఆమె మండిపడ్డారు. ఒక చేత్తో పెట్టి మరో చేతితో లాగేస్తున్నాడు జగన్ అని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి బాత్రూమ్ విస్తీర్ణం ఎంత?...ఊరు బయట 1 సెంట్ భూమి ఏమి చేసుకుంటారు ప్రజలు అని నిలదీశారు.
టీడీపీ అధికారంలోకి వస్తే విజయవాడలో నగరంలో భూమి ఇస్తాము అని ఆమె పేర్కొన్నారు. కార్పొరేషన్ మా చేతికి రాగానే ప్రజలకు విజయవాడ నగర పరిది లో ఇళ్ళ నిర్మించి ఇస్తాము అని హామీ ఇచ్చారు. మీ స్వేచ మైన ఓటును మాకు వేసి గెలిపించండి అని ఆమె కోరారు. మహిళా దినోత్సవం నాడే రాజధాని ఉద్యమం కోసం పాటుపడుతున్న మహిళలలను అమ్మవారి ఆలయంకి వెళ్ళకుండా అడ్డుకోవడం అరాచకం అని మండిపడ్డారు. మహిళ పై దాడులను తీవ్రంగా ఖండిస్తున్న అని అన్నారు. కాగా నేటితో విజయవాడలో ప్రచారం ముగిసింది. ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు చేసారు.