తిరుపతి ఉప ఎన్నిక కోసం టీడీపీ దూకుడు పెంచింది. వారం రోజులుగా ప్రచారాన్ని ముమ్మరం చేసింది.. అధినేత చంద్రబాబుతో పాటూ పార్టీ ముఖ్య నేతలందరూ అక్కడే ఉన్నారు. డోర్ టూ డోర్ క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే తిరుపతి టీడీపీ ప్రచారంలో కరోనా కలకలం రేపినట్లు వార్తలు గుప్పుమన్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు పాజిటివ్ తేలిందని పలు మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. వారికి కరోనా పాజిటివ్ తేలడంతో టీడీపీ నేతలు ప్రచారం నుంచి తప్పుకుని నేరుగా తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్లిపోతున్నారని ప్రచారం జరిగింది. ఇదిలా ఉంటే తిరుపతి టీడీపీ ప్రచారంలో కరోనా కలకలం రేపింది.


పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు పాజిటివ్ తేలింది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, మాజీ మంత్రి జవహర్, టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ సంధ్యా రాణిలకు కరోనా తేలింది. కరోనా పాజిటివ్ తేలడంతో టీడీపీ నేతలు ప్రచారం నుంచి తప్పుకుని నేరుగా తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్లిపోతున్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబును కరోనా టెన్షన్ వెంటాడుతోంది. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ సంధ్యారాణి గురువారం చంద్రబాబుతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. ఆ మరుసటి రోజునే అనిత, సంధ్యారాణిలకు కరోనా పాజిటివ్ తేలింది. దీంతో టీడీపీ నేతల్లో ఆందోళన మొదలైంది. పాజిటివ్ తేలిన నేతలతో కాంటాక్ట్ ఉన్నవారు కూడా పరీక్షలు చేయించుకునేందుకు సిద్ధమవుతున్నారు.దీంతో టీడీపీ నేతల్లో ఆందోళన మొదలైంది.


 పాజిటివ్ తేలిన నేతలతో కాంటాక్ట్ ఉన్నవారు కూడా పరీక్షలు చేయించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో తమపై జరుగుతున్న ప్రచారమంతా అవాస్తవమని టీడీపీ ప్రకటించింది. కరోనా రాకున్నా.. వచ్చిందంటూ తప్పుడు ప్రచారం చేస్తూ వారి వ్యక్తిత్వాన్ని అవమాన పరచడం జగన్ మీడియాకు తగదని హితవుపలికింది. ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తిరుపతి ఎన్నికల ప్రచారం సందిగ్ధంలో పడింది. ప్రచారంలో పాల్గొన్న మెజార్టీ సభ్యులకు కరోనా పాజిటివ్‌ రావడంతో వారంతా హోం ఐసోలేషన్‌కు చేరుకున్నారు. వారితోపాటు కాంటాక్ట్‌ అయిన వారందరూ హోం ఐసో లేషన్‌కు వెళ్లిపోయారు. దీంతో ఇపుడు తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం ఎలా అని అందరిలోనూ చర్చకు దారితీసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: