ఈ మధ్యకాలంలో ఇలా సెల్ఫీ పిచ్చి ఎంతో మంది ప్రాణాలు బలి తీసుకుంటుంది. సరదాగా సెల్ఫీ తీసుకోవడం వరకు ఓకే కానీ ప్రాణాలు పోయేలా సెల్ఫీ తీసుకుంటున్నారు నేటి రోజుల్లో ఎంతోమంది. స్మార్ట్ఫోన్ యుగంలో రోజురోజుకీ సెల్ఫీ పిచ్చి పెరిగిపోతుంది. ఇక సెల్ఫీ పిచ్చి కాస్త అతిగా పెరిగిపోవడంతో ఎంతోమంది ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లి సెల్ఫీ తీసుకోవాలని భావించి ప్రమాదవశాత్తు చివరికి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది.
సరదాగా సెల్ఫీ తీసుకుందాం అనుకున్న 16 ఏళ్ల బాలుడు చివరికి ప్రాణాలు పోయే పరిస్థితి తెచ్చుకున్నాడు. సెల్ఫీ తీసుకోవడం కోసం ఏకంగా రైలు పైకి ఎక్కాడు 16 ఏళ్ల యువకుడు. దీంతో కరెంట్ తీగలు తాకి విద్యుదాఘాతానికి గురై అతను తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు. ఈ విషాదకర ఘటన కర్ణాటకలోని మంగళూరులో వెలుగులోకి వచ్చింది. జోకట్టే రైల్వేస్టేషన్లో పదహారేళ్ల మహమ్మద్ దిశాన్ అనే వ్యక్తి సెల్ఫీ తీసుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఏకంగా సరికొత్తగా ప్రయత్నించాలని భావించి రైలు మీద ఎక్కాడు. విద్యుత్ తీగలు తగలడంతో 50% కాలి. ఇక స్థానికులు గమనించి అతన్ని ఆస్పత్రికి తరలించే లోపే చివరికి ప్రాణాలు వదిలాడు బాలుడు.