వైసీపీ ఎంపీ బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ ఆక‌స్మిక మృతితో తిరుప‌తి పార్ల‌మెంట్ స్థానానికి ఉప ఎన్నిక జ‌రిగింది. వైసీపీ నుంచి డాక్ట‌ర్ గురుమూర్తి, టీడీపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మి, బీజేపీ నుంచి మాజీ ఐఏఎస్ అధికారి డాక్ట‌ర్ ర‌త్న‌ప్ర‌భ పోటీలో ఉన్నారు. ఇక నిన్న పోలింగ్ జ‌రిగింది. పోలింగ్ స‌ర‌ళిని బ‌ట్టి చూస్తే ఓట‌ర్లు ఇక్క‌డ ఓటేసేందుకు పెద్ద ఆస‌క్తి అయితే చూపలేద‌ని అర్థ‌మ‌వుతోంది. తిరుప‌తి పార్ల‌మెంట్ ప‌రిధిలో మొత్తం 64.44 శాతం పోలింగ్ న‌మో దైంది. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తిరుప‌తి పార్ల‌మెంట్‌లో 79.03% న‌మోదైంది. గ‌తంతో  పోలిస్తే... తాజా ఎన్నిక‌ల్లో 14.59% త‌క్కువ పోలింగ్ న‌మోదైంది.

ఇక నియోజ‌క‌వ‌ర్గాల వారీగా చూస్తే చిత్తూరు జిల్లా స‌త్య‌వేడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో అత్య‌ధికంగా 72.68 శాతం న‌మోదైంది. ఆ త‌ర్వాత స్థానాన్ని 70.93 శాతంతో నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజ‌క‌వ‌ర్గం ద‌క్కించుకుంది. నెల్లూరు జిల్లా స‌ర్వేప‌ల్లిలో 66.19%, గూడూరులో 63.81%, వెంక‌ట‌గిరిలో 59.17%, చిత్తూరు జిల్లా శ్రీ‌కాళ‌హ‌స్తిలో 67.77%, తిరుప‌తిలో 50.58% పోలింగ్ న‌మోదైంది. తిరుప‌తిలో అతి త‌క్కువుగా కేవ‌లం 50 శాతం పోలింగ్ మాత్ర‌మే న‌మోదు అయ్యింది.

ఇక మొత్తంగా పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో 64.44% న‌మోదు కావ‌డం విశేషం. త‌గ్గిన పోలింగ్ శాతం ప్ర‌ధానంగా అధికార వైసీపీ నే బాగా టెన్ష‌న్ పెట్టేస్తోంది. వైసీపీ ఉప ఎన్నిక హ‌డావిడి ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి 3 ల‌క్ష‌ల మెజార్టీ అని చెపుతూ వ‌చ్చింది. త‌ర్వాత ఏకంగా 4 నుంచి 5 ల‌క్ష‌ల మెజార్టీ వ‌స్తుంద‌ని చెప్పింది. ఇప్పుడు పోలింగ్ శాతం బాగా ప‌డిపోవ‌డంతో పాటు గ్రౌండ్ లెవల్ రిపోర్టులు చూసుకున్నాక తాము అంచ‌నా వేసుకున్న మెజార్టీ అయితే రాద‌ని గుబులుతో ఉన్న‌ట్టు స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: