ఇక నియోజకవర్గాల వారీగా చూస్తే చిత్తూరు జిల్లా సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 72.68 శాతం నమోదైంది. ఆ తర్వాత స్థానాన్ని 70.93 శాతంతో నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం దక్కించుకుంది. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో 66.19%, గూడూరులో 63.81%, వెంకటగిరిలో 59.17%, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో 67.77%, తిరుపతిలో 50.58% పోలింగ్ నమోదైంది. తిరుపతిలో అతి తక్కువుగా కేవలం 50 శాతం పోలింగ్ మాత్రమే నమోదు అయ్యింది.
ఇక మొత్తంగా పార్లమెంట్ నియోజకవర్గంలో 64.44% నమోదు కావడం విశేషం. తగ్గిన పోలింగ్ శాతం ప్రధానంగా అధికార వైసీపీ నే బాగా టెన్షన్ పెట్టేస్తోంది. వైసీపీ ఉప ఎన్నిక హడావిడి ప్రారంభమైనప్పటి నుంచి 3 లక్షల మెజార్టీ అని చెపుతూ వచ్చింది. తర్వాత ఏకంగా 4 నుంచి 5 లక్షల మెజార్టీ వస్తుందని చెప్పింది. ఇప్పుడు పోలింగ్ శాతం బాగా పడిపోవడంతో పాటు గ్రౌండ్ లెవల్ రిపోర్టులు చూసుకున్నాక తాము అంచనా వేసుకున్న మెజార్టీ అయితే రాదని గుబులుతో ఉన్నట్టు సమాచారం.