తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఉన్న సమస్యల పరిష్కారం విషయంలో తెలంగాణలో పార్టీ నాయకత్వం ఎలా ముందుకు వెళుతుంది ఏంటనే దానిపై చాలా వరకు ఆసక్తికరంగా చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా కూడా తెలంగాణలో పార్టీ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. తెలంగాణలో 2014 నుంచి దాదాపుగా 17 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయారు. అయినా సరే చంద్రబాబు నాయుడు మాత్రం ఒక్కరంటే ఒక్కరితో కూడా సమావేశం నిర్వహించి పార్టీ మారకుండా అడ్డుకునే ప్రయత్నం చేయలేక పోయారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

2014 ఎన్నికల్లో గెలిచిన వాళ్ళ లో దాదాపు అందరూ అప్పుడు పార్టీ మారిపోయారు. వెంకటవీరయ్య మాత్రమే అప్పట్లో మిగిలారు. అయితే 2018 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు విజయం సాధించగా ఇద్దరు ఎమ్మెల్యేలో సండ్ర వెంకటవీరయ్య ముందు టిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలవగా తాజాగా అశ్వారావుపేట ఎమ్మెల్యే కూడా పార్టీ మారిపోయారు. దీంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో పార్టీ కోసం పని చేయడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నా సరే ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా ముందుకు అడుగులు వేయలేకపోయారు.

దాదాపుగా తెలంగాణలో పార్టీని లేకుండా చేశారని ఆరోపణలు వినపడుతున్నాయి. సాక్షాత్తు టిడిఎల్పిని టిఆర్ఎస్ పార్టీలో విలీనం చేసినా సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడ లేని పరిస్థితుల్లో ఉన్నారు అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు భయపడి చంద్రబాబు నాయుడు సీరియస్ గా   దృష్టి పెట్టడం లేదు అనే భావన కూడా రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని కొన్ని సంక్షేమ కార్యక్రమాల విషయంలో తెలంగాణలో విమర్శలు వస్తున్నా తెలంగాణ నేతలు ఎవరూ మాట్లాడటం లేదు. మరి ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి. పార్టీ నేతలు పార్టీని వదిలేసి వెళ్లిపోతున్నా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: