ఇక ఈ రెండు దేశాల మధ్య జరిగిన శాంతి ఒప్పందా లలో నిబంధనలకు అనుగుణం గానే భారత వ్యవహరిస్తూ ఉంటుంది కానీ పాకిస్తాన్ మాత్రం రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందాలను తుంగలో తొక్కుతూ దారుణం గా వ్యవహరిస్తూ భారత్ను రెచ్చగొట్టే విధంగా ఎప్పుడూ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తూ ఉంటుంది ముఖ్యం గా భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఉంటుంది పాకిస్తాన్. సరిహద్దుల్లో ఎప్పుడూ కాల్పులకు తెగబడుతూ ఉంటుంది.
అయితే ఇటీవలే విదేశాంగ మంత్రుల సమావేశం జరగ్గా ఇక ఈ సమావేశం లో పాకిస్తాన్ విదేశాంగా శాఖ మంత్రి తో పాటు భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కూడా హాజరవుతున్నారు. అయితే ఈ క్రమం లోనే అటు పాకిస్థాన్ భారత్ మధ్య ఎలాంటి చర్చలు ఉండవు అని ఇరు దేశాలు కూడా స్పష్టం చేశాయి. కేవలం ఆర్థికాభివృద్ధికి సంబంధించిన విషయాలను చర్చించడానికి మాత్రమే విదేశాంగ మంత్రుల తో సమావేశం కావడానికి సిద్ధమయ్యాము అంటూ జయశంకర్ తెలిపారు. అటు ఇతర దేశాలు కూడా పాకిస్తాన్ భారత్ మధ్య సమావేశం ఏర్పాటు చేయడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు.