ఇక్కడ గత రెండు రోజుల్లో భారీ సంఖ్యలో మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. మంగళ, బుధ వారాల్లో ఏకంగా 92 మృతదేహాలకు అంత్యక్రియలు జరిగాయి.సాధారణ రోజుల్లో ఈ స్మశానంలో రోజుకు 4 నుంచి 5 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తుంటారు. కానీ ఇటీవలి కాలంలో ఈ సంఖ్య భారీగా పెరిగింది. గడిచిన నాలుగు రోజుల్లో ఏకంగా 141 మృతదేహాలకు ఇక్కడ అంత్యక్రియలు చేశారు.జీజీహెచ్, కొత్తపేటలోని ప్రేవేట్ ఆస్పత్రుల నుంచి ఇక్కడికి మృతదేహాలను తరలిస్తున్నారు. బొంగరాలబీడుతో పాటు గుంటూరులోని మొత్తం 11 స్మశాన వాటికలకు మృతదేహాల తాకిడి ఎక్కువైంది.ఇక్కడి స్మశానాలకు తరలిస్తున్న మృతదేహాల్లో 90శాతం కోవిడ్ మరణాలేనని తెలుస్తోంది. అయితే కొందరి డెత్ సర్టిఫికెట్లో మాత్రం గుండెపోటుతో, దీర్ఘకాలిక వ్యాధులతో చనిపోయినట్లుగా చూపిస్తున్నారు.
ఇక్కడ గత రెండు రోజుల్లో భారీ సంఖ్యలో మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. మంగళ, బుధ వారాల్లో ఏకంగా 92 మృతదేహాలకు అంత్యక్రియలు జరిగాయి.సాధారణ రోజుల్లో ఈ స్మశానంలో రోజుకు 4 నుంచి 5 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తుంటారు. కానీ ఇటీవలి కాలంలో ఈ సంఖ్య భారీగా పెరిగింది. గడిచిన నాలుగు రోజుల్లో ఏకంగా 141 మృతదేహాలకు ఇక్కడ అంత్యక్రియలు చేశారు.జీజీహెచ్, కొత్తపేటలోని ప్రేవేట్ ఆస్పత్రుల నుంచి ఇక్కడికి మృతదేహాలను తరలిస్తున్నారు. బొంగరాలబీడుతో పాటు గుంటూరులోని మొత్తం 11 స్మశాన వాటికలకు మృతదేహాల తాకిడి ఎక్కువైంది.ఇక్కడి స్మశానాలకు తరలిస్తున్న మృతదేహాల్లో 90శాతం కోవిడ్ మరణాలేనని తెలుస్తోంది. అయితే కొందరి డెత్ సర్టిఫికెట్లో మాత్రం గుండెపోటుతో, దీర్ఘకాలిక వ్యాధులతో చనిపోయినట్లుగా చూపిస్తున్నారు.