కొవిడ్ నిర్ధారణకు ట్రునాట్ టెస్టులు కూడా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. భారీ స్థాయిలో కొవిడ్ టెస్టులు చేపట్టాల్సిందే అని అన్నారు. కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేపడితే తప్ప పరిస్థితి అదుపులోకి రాదు అని వెల్లడించారు. అదే విధంగా మరికొన్ని వ్యాఖ్యలు చేసారు. కొవిడ్ వైరస్ చాలా వేగంగా విస్తరిస్తోంది అని అన్నారు. 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా కలెక్టర్లు రంగంలో కి దిగాలి అని స్పష్టం చేసారు. యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని రాష్ట్ర స్థాయి అధికారులకు దిశానిర్దేశం చేసారు.
కొవిడ్ కేర్ సెంటర్లను తక్షణం అందుబాటులో కి తేవాలి అని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 19000 బెడ్లు మాత్రం అందుబాటులో ఉన్నాయి అని అన్నారు. మిగిలిన 19000 బెడ్లు కూడా అందుబాటులోకి తేవాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. 104 కాల్ సెంటర్ సేవలపై విస్తృతంగా ప్రచారం చేయాలి అని వివరించారు. 104 కు వచ్చే ప్రతి రిక్వెస్ట్ నూ సంబంధిత అధికారులకు కనెక్ట్ చేయాలి అని కోరారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు.