తెలంగాణా కూడా లాక్ డౌన్ విధించే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా సుప్రీం కోర్ట్ లో కరోనాపై విచారణ జరిగింది. దేశంలో కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో సంక్షోభ నివారణకు వివిధ రాష్టాలు తీసుకుంటున్న చర్యల పై కేసును సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు... దీనిపై విచారణ జరిగింది. ఢిల్లీ, బాంబే, సిక్కిం, మధ్యప్రదేశ్, కలకత్తా, అలహాబాద్ హైకోర్టుల్లో పలు కేసులు నమోదు అవ్వడంతో గందరగోళం నివారణకు కేసు విచారణను ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం చేపట్టింది.
అమికస్ క్యూరీగా (కోర్టు కు లీగల్ సలహాలు) హరీష్ సాల్వే ను ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం నియమించింది. నాలుగు అంశాలను ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. 1) దేశంలో ఆక్సిజన్ సరఫరా, 2) అత్యవసర మందుల సరఫరా, 3)టీకా విధానం, టీకాల నిర్వహణ, 4) లాక్ డౌన్ ఎత్తివేసే అధికారం అంశాల పై విచారణకు ముందుకు వెళ్తారు. లాక్ డౌన్ ఎత్తి వేసే అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో అంశమని ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు కేంద్రానికి నోటీసులు జారీ చేసిన ధర్మాసనం... విచారణ రేపటికి వాయిదా వేసింది. దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ ఉంది అంటూ సుప్రీం కోర్ట్ మండిపడింది.