ఇప్పుడు దేశమంతా కరోనా వైరస్ చుట్టూనే తిరుగుతోంది. కరోనా కేసులు కూడా రోజు రోజుకి మన ఊహకు అందనంత స్థాయిలో పెరుగుతూ పోతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే ముందస్తు జాగ్రత్త చర్యలను తీసుకుంది. కరోనా అంటూ వ్యాధి కావడం వలన ఒక మనిషి నుండి కనీసం ముగ్గురికి సోకే అవకాశం ఉంది కాబట్టి దీని వ్యాప్తి పెరుగుతోంది. ఏపీలోని ప్రముఖ హాస్పిటల్స్ అన్నీ కోవిడ్ రోగులతో నిండిపోయి ఉన్నాయి. హాస్పిటల్స్ లో రోగులకు సరైన వస్తులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ కరోనా వైరస్ ముఖ్యంగా శ్వాసక్రియ మీద దాడి చేస్తున్నందున, ఇప్పుడు అన్ని హాస్పిటల్స్ రోగులకు ఆక్సిజన్ తప్పనిసరి అయింది. కానీ ఆక్సిజన్ సరఫరా కొరత ఉండడంతో సమస్యగా మారింది. 

దీనిపై ఢిల్లీ హై కోర్ట్ సైతం కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పు బట్టింది. దీనితో అప్రమత్తమైన కేంద్రం ఆక్సిజన్ నిలువలను ఏర్పాటు చేస్తోంది. ఇదంతా ఇలా ఉంటే పెద్ద వారిలో అయితే మనము సులభంగా కరోనా లక్షణాలను గుర్తించగలుగుతున్నాము. కానీ చిన్న పిల్లల విషయానికి వస్తే ఎటువంటి లక్షణాలు ఉంటాయో తెలుసుకోవడం ఇప్పుడు చాలా ఎంతో ప్రధానం. గతంలో కరోనా వచ్చినప్పుడు పిల్లలపై పెద్దగా దీని ప్రభావం కనిపించలేదు. అయితే ప్రస్తుతం  మాత్రం చిన్న పిల్లల్ని సైతం ఇబ్బంది పెడుతోంది. తాజాగా నమోదైన కేసు వివరాలను చూస్తే పిల్లలకు మరియు 18 సంవత్సరాల లోపు వయసు ఉన్న కేసులు ఎక్కువగా ఉన్నాయి.

ఇలాంటి సమయంలో పిల్లల్లో ముఖ్యంగా జ్వరం, గొంతునొప్పి, పొడి దగ్గు, విరేచనాలు, వాంతులు, తలనొప్పి, ఒళ్లునొప్పులు లాంటి లక్షణాలు కనిపిస్తే కనుక వెంటనే కరోనా పరీక్షను చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇవి మాత్రమే కాకుండా రెండు మూడు రోజుల్లో నామమోదయినా కేసుల్లో కొత్తగా కనిపించిన లక్ల్షనాలు ఈ విధంగా ఉన్నాయి. చర్మంపై దాదులు రావడం, కళ్ళు ఎర్రబడడం, గోర్లు నీలం రంగులోకి మారడం, స్పృహ కోల్పోవడం ఎక్కువగా కనిపిస్తున్నాయి. పైన తెలిపిన ఎటువంటి లక్షణాలు అయినా మీ పిల్లల్లో మీరు గమనిస్తే ఎటువంటి ఆలస్యం చేయకుండా డాక్టర్ ని కలవడం ఉత్తమం.      

మరింత సమాచారం తెలుసుకోండి: