మందులు, ఆక్సిజన్ కొరత దేశంలో ఉంది. ఏపీలోను ఇబ్బందులు ఉన్నపటికీ దాన్ని ఎదుర్కొనేందుకు కార్యాచరణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాం అని తెలిపారు. రేపు సీఎం దగ్గర జరిగే సమీక్ష లో ఈ అంశాలను ప్రస్తావించి మెరుగైన చర్యలు చేపడతాం అన్నారు ఆయన. ప్రైవేటు ఆస్పత్రులు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు మాత్రమే వసూలు చేయాలి అని పేర్కొన్నారు. లేకపోతే కఠిన చర్యలు తీసుకోడానికి వెనుకాడబోము అని హెచ్చరించారు. ప్రజలు మాస్కు లు, భౌతిక దూరం లాంటి జాగ్రత్తలు తీసుకుని కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి కృషి చేయాలి అని సూచించారు.
వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా వేగంగా పూర్తి చేసే దుకు ప్రయత్నం చేస్తున్నాం అని ఆయన అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 360 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతోంది. ప్రభుత్వ ఆస్పత్రులకు ఇబ్బంది లేదు అని స్పష్టం చేసారు. ఆక్సిజన్ ప్లాంట్ పెట్టేందుకు కేంద్రం సహకారం అందిస్తామని తెలిపింది అని, ఏపీలో 49 లక్షల మందికి వ్యాక్సినేషన్ వేశాం అని ఆయన తెలిపారు. 18 ఏళ్ల పైబడిన వ్యక్తులకు వ్యాక్సినేషన్ వేసే విషయంలో ఇంకా స్పష్టత లేదు అని అన్నారు. సీఎం దగ్గర చర్చించి నిర్ణయం తీసుకుంటాం అని ఈ సందర్భంగా వివరించారు. కరోనా పరీక్షల సామర్ధ్యం పెంచుతామని అన్నారు.