టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని దోపిడీకి పనికిమాలిన జగన్ రెడ్డి పాల్పడుతున్నాడు అని మండిపడ్డారు. అలీబాబా 40దొంగలముఠా దెబ్బకు రాష్ట్రం ఎలా సర్వనాశనమవుతోందో ప్రజలంతా గ్రహించాలి అని ఆయన సూచించారు. ఇసుక, మద్యం, మట్టి, భూములను దోచేస్తున్న దొంగలముఠా నాయకుడు ఇప్పుడు పోలవరంపై కన్నేశాడు అని అన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో రూ.780కోట్లు ఆదాచేశామని అసెంబ్లీలో జగన్ రెడ్డి డబ్బా కొట్టాడు అని అన్నారు.

రూ.780 కోట్లు ఆదా చేసిన వ్యక్తి, ఇప్పుడు ప్రాజెక్ట్ అంచనావ్యయం రూ.3222కోట్లకుఎందుకు పెంచాడు?  అని నిలదీశారు. పోలవరం అంచనా వ్యయం పెంపుపై రాత్రికి రాత్రి జీవో ఇచ్చిన జగన్ రెడ్డి దొంగల ముఠా రూ.2500కోట్లవరకు కొట్టేసింది అని మండిపడ్డారు. ప్రాజెక్ట్ నిర్మాణప్రదేశంలో ఇసుక అందుబాటులోఉంటే, దానికోసం రూ.500కోట్లు కేటాయించారు అని అన్నారు. ఈ రెండేళ్లలో పోలవరం అంచనాలుపెంచి , రూ.3,222 కోట్లు దోచేసింది, వాస్తవమో కాదో జగన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేసారు.

చంద్రబాబు నిర్మించిన పట్టిసీమ దండగన్న జగన్ రెడ్డి, నేడు మరో ఎత్తిపోతల పథకానికి రూ.912కోట్లు ఎందుకు కేటాయించాడు? అని నిలదీశారు. పట్టిసీమతో పాటు, మరో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉండగా, పోలవరం కుడికాలుపై ఎత్తిపోతల పథకం అవసరమా?  అని ప్రశ్నించారు. కేవలం దోపిడీకోసమే జగన్ రెడ్డి రూ.912కోట్లకు ఎత్తిపోతలపథకం పేరుతో ఎసరు పెట్టాడు అని అన్నారు. ఎక్కడికక్కడ అందినకాడికి దోచేస్తున్న జగన్ రెడ్డిని ప్రజలునిలదీయకపోతే ఎలా?  అని ప్రశ్నించారు.  తన ప్రభుత్వంలో పోలవరం ఎంత పూర్తి చేశాడో, నిర్మాణానికి ఎంతఖర్చుపెట్టాడో ప్రజలందరికీ అర్థమయ్యేలా జగన్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా అని అన్నారు. పోరంబోకు విజయసాయిరెడ్డికి చంద్రబాబు గొప్పతనం ఏం తెలుస్తుంది? అని నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: