సీటీ స్కాన్ కు ధరలు నిర్ణయించాలని సీఎం ఆదేశించారు అని ఆయన తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజలు మాస్కులు తప్పనిసరిగా ధరించాలి అని ఆయన స్పష్టం చేసారు. ప్రజలు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి అని సూచించారు. పది, ఇంటర్ పరీక్షల రద్దుపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఆస్పత్రుల్లో బెడ్స్ పెంచాలని సీఎం ఆదేశించారు అని ఆయన వెల్లడించారు.
ఏపీలో 18-45 మధ్య వయసువారు 2,04,70,364 మంది ఉన్నారని ఆయన అన్నారు. ఏపీలో రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ విధిస్తామని ఆయన చెప్పారు. ఏపీలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు అవుతుంది అన్నారు. ఏపీలో ఇప్పటికే 45 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని తెలిపారు. ఉచిత వ్యాక్సిన్ కోసం 1600 కోట్లు ఖర్చు అవుతుంది అని ఆయన చెప్పుకొచ్చారు. వైద్య పరీక్షలకు అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని నేడు మీడియా తో మాట్లాడుతూ వెల్లడించారు.