ఏపీలో కరోనా రోగులు భారీగా పెరుగుతుండటంతో ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్, ఇతర మౌలిక సదుపాయాల కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ మంత్రులతో ఎప్పటికప్పుడు సమావేశమై పరిస్ధితిని సమీక్షిస్తున్నారు. రైతు బజార్లు, మార్కెట్లను వికేంద్రీకరించాలని ఆయన సూచించారు. వార్డుల్లో ప్రత్యేక మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.ఈ నేపథ్యంలో పది, ఇంటర్ పరీక్షలు జరుగుతాయ, జరగవా అనే అనుమానం గత కొంత కాలంగా అందరి మదిలో వుంది. పరిస్థితుల ప్రభావం వలన జరగవేమోనని అందరూ భావించారు.
కాని ఈ అనుమానాలకు ఏపీ ప్రభుత్వం తెరదించింది. రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు యధాతథంగా జరుగుతాయని ప్రకటించింది.విద్యార్ధుల ఆరోగ్యాన్ని దృష్టిని వుంచుకుని, వారికి హాని జరగకుండా టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.104 కాల్ సెంటర్ పర్యవేక్షణ బాధ్యత జాయింట్ కలెక్టర్లదేనని ఆయన అన్నారు.సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయాలను మంత్రి ఆళ్ళ నాని వెల్లడించడం జరిగింది.కాబట్టి జాగ్రత్తలు మాస్కులు వేసుకొని సామాజిక దూరం పాటించండి.సురక్షితంగా ఉండండి...