దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తుంది.కేసులు రోజు రోజుకి దారుణంగా పెరిగిపోతున్నాయి. అలాగే మరణాలు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో ప్రభుత్వం అందరికి టీకాలు ఇవ్వాలని చూస్తుంది.ఇక టీకాల కొర‌త బాగా ఉంది. ఎంత ఆల‌స్యంగా ఇస్తే టీకా సామ‌ర్థ్యం అంత బాగా ఉంటుంద‌ని అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో కొవిషీల్డ్ రెండో డోసు తీసుకునే విరామాన్ని మ‌రోసారి పెంచే ఆలోచ‌న చేస్తోంది ఎక్స్‌ప‌ర్ట్ క‌మిటీ. దీనిపై వ‌చ్చే వారం ఫైనల్ గా నిర్ణ‌యం తీసుకోనున్నారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్ తొలిసారి వ‌చ్చిన‌ప్పుడు రెండో డోసును 4 నుంచి 6 వారాల మ‌ధ్య తీసుకోవాల‌ని వారు సూచించారు.


ఆ త‌ర్వాత గ‌త ఏప్రిల్‌లో ఇది 6-8 వారాల మ‌ధ్య అయితే టీకా మ‌రింత బాగా ప‌ని చేస్తుందంటూ కేంద్రం ప్ర‌క‌టించింది.ఇప్పుడు ఆ స‌మ‌యాన్ని మ‌రింత పొడిగించాలని ఆలోచ‌న చేస్తున్నారు. అదే జ‌రిగితే ప్ర‌స్తుతం ఉన్న టీకా కొర‌త నేప‌థ్యంలో త‌యారీదారుల‌పై ఒత్తిడి కాస్త‌యినా త‌గ్గే అవ‌కాశం ఉంటుంది. గ‌త మార్చి నెల‌లో లాన్సెట్‌లో ఓ అధ్య‌య‌నాన్ని ప్రచురించడం జరిగింది. ఇక దాని ప్ర‌కారం కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను 12 వారాల త‌ర్వాత తీసుకుంటే సామ‌ర్థ్యం 81.3 శాతంగా ఉన్న‌ట్లు గుర్తించారు. అదే ఆరు వారాలలోపు తీసుకుంటే మాత్రం సామ‌ర్థ్యం 55.1 శాతంగా మాత్ర‌మే ఉంద‌ని ప‌రిశోధ‌కులు తెలిపారు.ఇక బ్రిట‌న్‌, బ్రెజిల్‌ దేశాల‌లో జ‌రిగిన చివ‌రి ద‌శ ప్రయత్నలలో వ్యాక్సిన్ సామ‌ర్థ్యం 90 శాతం దాకా ఉంటున్న‌ట్లు తేలింది. అయితే అది జ‌ర‌గాలంటే ముందు స‌గం డోసు ఇచ్చి నెల త‌ర్వాత మొత్తం డోసు ఇవ్వాల్సి ఉంటుంద‌ని ఈ ట్ర‌య‌ల్స్ తేల్చాయి.


ఇక ఇప్ప‌టికే ఇంగ్లాండ్, కెన‌డాలాంటి దేశాలు 12 వారాలు, 16 వారాల త‌ర్వాత రెండో డోసు ఇస్తున్నాయి. రెండో డోసుల మ‌ధ్య ఎక్కువ స‌మ‌యం ఉంటే మెరుగైన ఫ‌లితాలు వ‌స్తున్న‌ట్లు నిపుణులు తెలుపుతున్నారు.ఇక భారత్ లోనూ ఇదే అమ‌లు చేస్తే వ్యాక్సిన్ల కొర‌త‌ను కాస్త‌యినా తగ్గించేందుకు అవకాశం ఉంటుందట. రెండో డోసు తీసుకునే వాళ్లు మ‌రికొంత ఎక్కువ కాలం ఆగాల్సి రావ‌డంతో ఆ మేర‌కు మ‌రికొంత మందికి తొలి డోసు వేసే అవ‌కాశం ద‌క్కుతుంది. ఇలా వ్యాక్సిన్ల కొర‌త‌కు కాస్త చెక్ పెట్ట‌వ‌చ్చు. ఎక్కువ గ్యాప్ త‌ర్వాత రెండో డోసు తీసుకుంటే ఎక్కువ రక్ష‌ణ ఉండ‌టంతోపాటు ఆ లోపు క‌నీసం ఒక్క డోసు తీసుకున్న వారు కాస్త‌యినా ఆరోగ్యంగా ఉంటారు. ఇలా రెండు ర‌కాలుగా దీనివల్ల ఉపయోగం వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: