కరోనా వైరస్ కష్ట కాలంలో ఎన్నో హృదయ విదారక ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఎంతో మందిని కలిచి వేస్తున్నాయి. ఓవైపు మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూ ఎంతోమంది పై పంజా విసిరి ప్రాణాలను బలి తీసుకోవడమే కాదు ఇక ఎన్నో కుటుంబాలను రోడ్డున పడే పరిస్థితి తీసుకు వస్తుంది. కరోనా వైరస్ కారణంగా ఎలాంటి ఉపాధి లేక పోవడంతో కనీసం తినడానికి తిండి కూడా లేని పరిస్థితిని తీసుకొచ్చి దుర్భర జీవితాన్ని గడిపే దుస్థితిని తీసుకువస్తుంది మహమ్మారి కరోనా వైరస్.  దీంతో బ్రతకడం కంటే చావడం మేలు అనుకునే పరిస్థితి తీసుకు వస్తుంది.



 అదే సమయంలో మనుషుల మధ్య బంధాలు బంధుత్వాలు విలువ లేకుండా చేసి మనుషుల్లో మిగిలి ఉన్న కొంచెం మానవత్వాన్ని కూడా చంపేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎంతోమంది ఏకంగా కని పెంచిన తల్లిదండ్రులను సైతం కరోనా వైరస్ భయంతో రోడ్డు పాలు చేసిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.  వృద్ధాప్యంలో తోడు నీడగా నిలిచి తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవాల్సిన పిల్లలే చివరికి  వైరస్ భయం తో రక్తసంబంధం  మరచి కనీస మానవత్వం కూడా రోడ్డుపై వదిలేస్తున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.



 ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన సభ్యసమాజం తలదించుకునేలా చేస్తుంది   ఏకంగా కని పెంచిన తల్లి విషయంలో ఆ కూతురు కాస్తైనా దయ చూపించలేకపోయింది. దీంతో ఏకంగా కన్నతల్లిని కుమార్తెలు చెట్టు కింద వదిలేసారు. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. వెంకాయమ్మ అనే 65 ఏళ్ల వృద్ధురాలు ఇటీవలే వైరస్ లక్షణాలతో బాధపడుతూ ఉండడంతో ఆమె కుమార్తెలు ఏకంగా ఆసుపత్రి సమీపంలో ఉన్న ఒక చెట్టు కింద వదిలేసి వెళ్ళిపోయారు  అయితే తన పేరుమీద ఉన్న ఐదు లక్షల ఆస్తిని పంచుకున్న తర్వాత ఇక ఇప్పుడు నడిరోడ్డుపై వదిలేసారు అంటూ ఆ వృద్ధురాలు కన్నీటి పర్యంతమైంది. ఇక స్పందించిన పంచాయతీ  కార్యదర్శి పోలీసుల సాయంతో ఆమెను ఇంటికి చేర్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: