ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజూ పాజిటివ్ కేసుల నమోదలో.. మరణాల సంఖ్యల పెరుగుదల పెరుగుతూ వస్తోంది. దీంతో ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు వేయించుకుంటున్నారు. కరోనా నిబంధనలు కఠినంగా పాటిస్తూ జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.



అయితే దేశంలోని యూపీ రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అక్కడ రోగుల సంఖ్య పెరుగుతుండటంతో.. ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో బల్లియాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ కరోనా నివారణకు చిట్కా చెప్పారు. కోవిడ్ నివారించడానికి రోజూ ఆవు మూత్రం తాగాలని ప్రజలను సూచనిచ్చారు. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ వీడియోలో తానూ రోజు గోమూత్రం తాగుతున్నానని, అందుకే తనకు కరోనా సోకడం లేదని చెప్పడంతో.. ఈ వీడియో వైరల్ అయింది.



ఈ వీడియోలో ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ ఇలా మాట్లాడుతాడు.. ‘‘బల్లియా నియోజకవర్గ ప్రజలకు నేను విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. ఇది పతంజలి గోదాన్ సారం.. ప్రతి రోజు ఉదయం పరిగడపున చల్లటి నీటిలో ఐదు మూతలు కలిపిన తర్వాత నేను ఆవు మూత్రాన్ని తాగుతాను. దీంట్లో సైంటిఫిక్ రీజన్ ఏంలేదు. కానీ ఆవు మూత్రాన్ని తాగిన‌ తర్వాత.. రోజూ నేను మీ అందరి మధ్య 18 గంటలు పాటు నిరంతరం ఉంటున్నాను. అయినా నాకు కరోనా సోక‌డంలేదు. కరోనా మహమ్మారిని నియంత్రించాలంటే.. ఆవు మూత్రం తీసుకోవడం ఉత్తమం.’’ అని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: