కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా కోరలు ఛాచుతున్న సంగతి తెలిసిందే.. ఈ మహమ్మారి వల్ల ఎందరో ప్రాణాలను కోల్పోయారు.. అయినా కూడా భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ప్రజలు పిట్టల్లారాలిపోతున్నారు. ఆక్సిజన్ అందక ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. వైరస్ కు చెక్ పెట్టేందుకు కేంద్రం వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చింది. వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో ఇన్ఫెక్షన్ రేటు చాలా తక్కువగా ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు. వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన వారు తప్పకుండా ఆరోగ్య సేతు, కోవిన్ యాప్ లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది.


అయితే ఆ యాప్ లలో రిజిస్టర్ చేసుకోవాలి అంటే ఒక్కోసారి సర్వర్ బిజీ అనో లేక ఇతర కారణాల వల్ల కానీ ఇప్పుడు అవి ఓపెన్ కావడం లేదు. ఇకపోతే మొదటి డోస్ వేయించుకున్న 45 ఏళ్లకు పైబడిన వారు కూడా స్లాట్ తప్పనిసరిగా బుక్ చేసుకోవాలని సర్కార్ స్పష్టం చేస్తోంది. అయితే.. చాలా రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత వేధిస్తోంది.సరిపోయేలా వ్యాక్సిన్ కూడా దొరకడం లేదు..ఈ మేరకు పేటీఎం..కీలక ఫీచర్ తీసుకొచ్చింది.. స్లాట్లు అందుబాటులోకి వచ్చిన సమయంలో నోటిఫికేషన్లను కూడా పొందే అవకాశాన్ని కల్పించారు.. 


ఈ ఫీచర్ కోసం ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. 

ముందుగా యాప్ ను ఓపెన్ చేయాలి..

అందులో వ్యాక్సిన్ ఫైండర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అందులో క్లిక్ చేయండి..

సెర్చ్ బై పిన్ కోడ్ లేదా డిస్ట్రిక్ట్ కనిపిస్తుంది..

మీ పిన్ కోడ్ ను ఎంటర్ చేసుకోవాలి.. తర్వాత ఏజ్ గ్రూప్ ను అడుగుతుంది..18-44, 45+ రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. మీ వయస్సు ఆధారంగా ఈ ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి.

చెక్ అవైలబులిటి అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి..

స్లాట్ల వివరాలు కనిపిస్తాయి. స్లాట్లు ఖాళీగా లేకపోతే అక్కడ కనిపించే నోటిఫై మి వెన్ స్లాట్స్ ఆర్ అవైలబుల్ ఆప్షన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. స్లాట్లు ఎప్పుడు * అందుబాటులోకి వస్తే..అప్పుడు పేటీఎం నోటిఫికేషన్ పంపిస్తుంది.

 సెర్చ్ డిస్ట్రిక్ట్ ఆప్షన్ ను ఎంచుకుంటే ముందుగా స్టేట్, తర్వాత జిల్లాను ఎంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత మిగతా ప్రక్రియ సేమ్ గానే ఉంటుంది.


ఈ యాప్ ద్వారా కేవలం వ్యాక్సిన్ కోసం స్లాట్ బుక్ చేసుకునే అవకా శం మాత్రమే ఉంది.. వ్యాక్సిన్ కోసం అయితే ఆరోగ్య సేతు, కోవిన్ లో మాత్రమే రిజిస్టర్ చేసుకోవాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: