న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి రోజురోజుకి విపరీతంగా పెరిగిపోతుంది. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ప్రభుత్వం దేశమంతటా వ్యాక్సినేషన్ చేపట్టినప్పటికీ కరోనా విజృంభణకు చెక్ చెప్పలేక పోయింది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్‌, మెడికల్ ఆక్సిజన్‌లపై విధిస్తున్న పన్నులను రద్దు చేయాలంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ కేంద్రానికి లేఖ రాశారు. ఈ లేఖపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు.

అయితే ఔషధాల, మెడికల్ ఆక్సిజన్ ధరలను అదుపులో ఉంచేందుకు కరోనా వ్యాక్సిన్‌పై 5 శాతం, ఔషధాలు, మెడికల్ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లపై 12 శాతం పన్ను విధిస్తున్నామని సీతారామన్ తెలిపారు. అంతేకాకుండా వీటిపై పూర్తి జీఎస్‌టీ మినహాయింపు ఇవ్వడం కుదరదని తెలిపారు. ఒకవేళ వీటిపై జీఎస్‌టీను మినహాయిస్తే దేశీయ ఉత్పత్తి దారులకు నష్టం వస్తుందని ఆమె అన్నారు. ఉత్పత్తి దారులు తమ ముడిపదార్థాలకు, సేవలకు చెల్లించిన పన్నులు తిరిగి రాబ్టటలేక వస్తువు ధరను పెంచుతారని, దాని వల్ల వినియోగ దారునిపై భారం పడుతుందని వివరించారు.


ఇప్పటికే దేశంలోని కరోనా వ్యాక్సిన్లు, వాటి ముడిపదార్థాలు, సంబంధిత పరికరాలపై దిగుమతి పన్నును తగ్గించామని, దీని ద్వారా రాష్ట్రాలకు వీటిపై పడే ఐజీఎస్‌టీ (ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్) పన్ను 70 శాతం తగ్గుతుందని సీతారామన్ చెప్పారు. అయితే దేశంలో 45 సంవత్సరాల వయసుపై బడిన వారికి వ్యాక్సిన్‌ను కేంద్రమే ఉచితంగా అందిస్తుందని, దానికి సంబంధించిన పన్నులను కేంద్రమే భరిస్తుందని తెలిపారు.

ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కరోనా విజృంభణ విపరీతంగా పెరిగింది. రోజురోజుకు రాష్ట్రంలో కేసుల సంఖ్యతో పాటు మరణాల రేటు కూడా పెరిగిపోతుంది. దీంతో సీఎం మమతా బెనర్జీ రాష్ట్రంలో పార్షియల్ లాక్‌డౌన్‌ను అమలులోకి తీసుకొచ్చారు. రాష్ట్రంలో పర్యటించే వారంతా కరోనా నెగిటివ్ రిపోర్టును తప్పకుండా చూపించాలని, ఆ రిపోర్టు మూడు రోజులలోనిదే అయ్యుండాలని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: