కరోనా వైద్యానికి సంబంధించి కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు అనుసరిస్తున్న విధానం పట్ల ఇప్పుడు ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ప్రజల వద్ద నుంచి భారీగా వసూలు చేస్తున్నాయి అనే ఆవేదన చాలా వరకు కూడా ఉంది. ప్రజల వద్ద నుంచి కనీస కనికరం లేకుండా కొన్ని ఆస్పత్రుల్లో భారీగా డబ్బులు వసూలు చేయడమే కాకుండా అనవసరంగా కరోనా టెస్టింగ్ లకు సంబంధించి కూడా వసూలు చేసే పరిస్థితి ఉంది అనే చెప్పాలి. సిటీ స్కాన్ చేయాలి అంటూ అనవసరంగా డాక్టర్లు సూచించడం ఆ తర్వాత దానికి 4 నుంచి 7 వేల వరకు వసూలు చేయడం అందులో డాక్టర్ కూడా కొంత కమీషన్ తీసుకోవడం వంటివి జరుగుతున్నాయి.

ఈ కరోనా సమయంలో జరుగుతున్న వ్యాపారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా కాస్త సీరియస్ గా వ్యవహరిస్తున్న సరే ప్రైవేట్ ఆస్పత్రులలో మాత్రం మార్పు రావడం లేదు. ఇక తాజాగా టెస్టింగ్ విషయంలో అనేక అనుమానాలు మొదలయ్యాయి. తాజాగా గుంటూరులో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఒక గర్భిణీ టెస్ట్ చేయించుకోగా ఆమెకు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఆ తర్వాత ఆమె పొన్నూరు వెళ్ళి పరీక్ష చేయించగా అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో నెగిటివ్ గా నిర్ధారణ అయింది. దీనితో ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

 అసలు తనకు కరోనా ఉందా లేదా అనేది అర్థం కాక మరో ఆసుపత్రికి వెళ్ళింది. ఇటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నాయి. దీనిపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ కూడా తెలంగాణలో ఈ అంశానికి సంబంధించి ఎక్కువగా ఫోకస్ చేయకపోతే మాత్రం ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని కొంతమంది హెచ్చరికలు చేస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు ప్రజలు కష్ట సమయంలో ఉన్నప్పుడు కూడా ఈ విధంగా వసూలు చేయడం... అనవసరంగా తప్పుడు సమాచారం ఇవ్వడం పట్ల ఆందోళన మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: