తెలంగాణలో వున్నటుండి ఒక్కసారిగా లాక్డౌన్ తెరపైకి వచ్చింది. అస్సలు లాక్డౌన్ తో ఉపయోగమే లేదని నాలుగురోజుల క్రితం ప్రకటించిన సీఎం కేసిఆర్ వున్నటుండి..నేడు కేబినెట్ మీటింగ్ పెట్టి.. లాక్డౌన్ పై నిర్ణయం తీసుకోవడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.. పక్కా రాజకీయ వ్యూహంతోనే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక్క లాక్ తో మూడు విషయాలని బందిచేయడానికి సీఎం ట్రై చేస్తున్నాడని చెబుతున్నారు..

ఆ మూడు విషయాలు ఏమంటే..
1. గత కొంత కాలంగా ప్రతీ విషయం లో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం పై మొట్టి కాయలు వేస్తున్నది. కరోనా విషయంలో ఇప్పటికే పలుమార్లు చీత్కరాలు పెట్టింది.. మా పక్కింట్లో చనిపోయిన అతనికి స్మశానంలో స్థలం దొరకడానికే గంటల కొద్దీ వేచి వున్నమని.. ghmc అధికారి ఫోన్ ద్వారా నైట్ 9 కి అనుమతి లభించింది.. అలాంటిది రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా వుందో అద్దం పడుతున్నది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. కరోనా కట్టడి పై తీసుకుంటున్న చర్యలను ఎప్పటికపపుడు తమకు తెలపాలని ఆదేశించింది. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం  కరోనా ఉధృతి వేగంగా వుంది... రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూ వున్నది. ఇలాంటి సమయంలో మళ్ళీ కోర్టు మొట్టి కాయలు వేయడానికి ముందే.. తాము కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.

2. నేడు రాష్ట్రంలో టీకా, vaccine, oxygen అన్నిటిలో కొరత వుంది. విపక్షాలు, ప్రజలు ప్రభుత్వం పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.. ఇలాంటి సమయంలో lockdown పెడితే నిరసనలు తగ్గించే అవశమున్నదని సీఎం ఆలోచన చేస్తున్నాడని మరో వాదన.

3. వారం రోజులుగా తెలంగాణలో కరోనా కంటే ఈటలదే హాట్ టాపిక్. మంత్రివర్గం నుంచి బర్త్ రఫ్ అయినప్పటి నుంచీ ఈటల రాజకీయ వ్యూహం పై దృష్టి పెట్టారు.. హుజూరాబాద్, హైదరాబాద్లో కార్యకర్తలతో సమావేశాలు పెడుతున్నారు. ఈ క్రమంలో lockdown పెడితే ఈటల ఎత్తులకు check పెట్టడమే కాకుండా... కామ్ గా సర్వేను కూడా పూర్తి చేయవచ్చు అని భావిస్తున్నట్టు విమర్శలూ వస్తున్నాయ్.. ఈ మూడు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే సీఎం lockdown ఆలోచన చేస్తున్నాడని విశ్లేషకులు చెబుతున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: