ఇక దేశంలో కరోనా తీవ్రంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే.రోజుకి ఎన్నో లక్షల కేసులు నమోదవుతున్నాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక కరోనా మహమ్మారి చుక్కలు చూపిస్తున్న నేపథ్యంలో హైకోర్టు ఒత్తిడి మీద కేసీఆర్ తెలంగాణాలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.ఇక రాష్ట్రంలో బుధవారం నుంచి లాక్ డౌన్ విధించడంపై రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వం పై నిప్పులు కక్కింది.ఈరోజు ఉదయం 10 గంటల వరకు కనీసం వీకెండ్ లాక్ డౌన్ పెట్టే ఆలోచనలో కూడా లేని ప్రభుత్వం.. ఉన్నట్టుండి మరుసటి రోజు నుంచి మొత్తం లాక్ డౌన్ పెట్టడం ఏంటని ప్రశ్నించింది. ఒక్కసారిగా బుధవారం నుండి లాక్ డౌన్ అంటే ఇతర రాష్ట్రాల ప్రజలు ఇంత తక్కువ సమయంలో వారి స్వస్థలాలకు ఎలా వెళ్తారని ప్రశ్నించింది. లాక్ డౌన్ నేపథ్యంలో గతేడాది వలస కార్మికులు ఇబ్బందుల నేపథ్యంలో ఈసారి ఇబ్బంది అలా కాకుండా ఉండాలని హైకోర్టు సూచించింది.
రోజువారీ కూలి చేస్తూ బతికే వాళ్ళు వలస కార్మికుల కోసం ప్రభుత్వం ఏం చేస్తోందని హైకోర్టు అడగగా.. 50 శాతం వలస కార్మికులు వాళ్ళ వాళ్ళ సొంతూళ్లకు వెళ్లారని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపడం జరిగింది.

ఇంకో వైపు , మహమ్మారి విజృంభిస్తున్న వేళ లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌పై పూర్తి వివరాలు తెలపడానికి హైకోర్టును అడ్వకేట్ జనరల్ మూడు రోజుల సమయం కోరారు. అప్పటి వరకు జనాలు ప్రాణాలు కోల్పోవాలా అని ధర్మాసనం సీరియస్ అయింది. మందుల రేట్లు, ప్రైవేట్ హాస్పిటల్ అధిక బిల్లులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ సమయంలో హాస్పిటల్‌పై చర్యలు తీసుకోవాలని తామెలా ఆదేశాలిస్తామని హైకోర్టు తెలిపింది.ఏది ఏమైనా కాని కేసీఆర్ కనీసం ఇంగీత జ్ఞానం లేకుండా ఇలా వెంటనే లాక్ డౌన్ పెట్టడం ఏమాత్రం మంచిది కాదు.ఒక రెండు రోజులు గ్యాప్ తీసుకొని ప్రకటించిన సమంజసంగా ఉండేది.

మరింత సమాచారం తెలుసుకోండి: