ఒక వైపు దేశం కరోనాతో అల్లాడుతూ కొట్టు మిట్టాడుతుంటే మరో వైపు కాపాడాల్సిన వైద్య సిబ్బందే ఏమాత్రం కరోనా ఆసుపత్రి కరోనా రోగులు అని కనికరం లేకుండా నీచపు చేష్టలకు పాల్పడుతున్నారు.తాజాగా అలాంటి నీచపు సంఘటన వెలుగులోకి వచ్చింది. బీహార్ ఆసుపత్రుల్లో తనకు ఎదురైన పరమ నీచపు అనుభవాలను వెల్లడిస్తూ ఓ
మహిళ కన్నీళ్లు వాపోయింది. . ఈ సంఘటన పలువురి హృదయాలను చాలా కలచివేస్తోంది. వైద్యుల నిర్లక్ష్యానికి తన
భర్త ఎలా బలైపోయిందీ వివరిస్తూ కన్నీరుమున్నీరయ్యి విలపించింది.నోయిడాకు చెందిన బాధితురాలు తన భర్తతో కలిసి ఏప్రిల్ 9న బంధువులతో కలిసి
హోలీ జరుపుకునేందుకు
బీహార్ వచ్చింది. అక్కడ ఆమె భర్తకు జ్వరం రావడంతో రెండుసార్లు కరోనా పరీక్షలు చేస్తే నెగటివ్ వచ్చింది. ఆ తర్వాత ఆర్టీ పీసీఆర్ పరీక్షలు చేయించుకుని ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.ఈ లోపు
డాక్టర్ఒకరు చెస్ట్కు సీటీ స్కాన్ చేయించమని చెప్పారు.
అదే సమయంలో ఆమె తల్లి కూడా అనారోగ్యం బారినపడింది. దీంతో ఇద్దరినీ భాగల్పూర్లోని గ్లోకల్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ఆమె భర్తకు రెమ్డెసివిర్ ఇచ్చే క్రమంలో సిబ్బంది సగం ఇంజక్షన్ను వృథా చేశారు. వైద్యులు ఇలా వచ్చి అలా వెళ్లిపోయేవారే తప్పితే రోగులను చూసేవారు కాదు. ఇక సిబ్బంది కూడా ఎప్పుడో తప్ప కనిపించేవారు కాదు. అంతేకాదు, రోగులకు మందులు కూడా ఇచ్చేవారు కాదు. క్రమంగా తన తల్లి ఆరోగ్యం కుదటపడినా
భర్త ఆరోగ్యం మరింత క్షీణించిందని, మాట్లాడలేకపోయవాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నీళ్లు కావాలని సైగలు చేసిన ఎవరూ ఇచ్చేవారు కాదని తెలిపింది.గ్లోకల్ ఆసుపత్రిలో
జ్యోతి కుమార్ అనే ఒక్క అటెండెంట్ ఉండేవాడని, తన భర్తకు శుభ్రమైన బెడ్షీట్లు ఇచ్చేందుకు సాయం చేయాల్సిందిగా అతడిని కోరారని తెలిపింది.
అతడు అందుకు సాయం చేయకపోగా, తాను తన భర్తతో మాట్లాడుతున్న సమయంలో వెనక నుంచి వచ్చి తన చున్నీలాగాడని, తాను వెనక్కి తిరిగి చూస్తే వెకిలిగా నవ్వుతూ నడుముపై చేయి వేశాడని ఆరోపించింది. దీంతో భయంతో వణికిపోయానని, తన తల్లి,
భర్త అక్కడే చికిత్స పొందుతుండడంతో వారికేమైనా హాని తలపెడతాడేమోనని ఎవరికీ ఈ విషయాన్ని చెప్పలేదని ఆమె తెలిపింది. మరింత మెరుగైన చికిత్స కోసం తన భర్తను మాయాగంజ్,
పాట్నా ఆసుపత్రులకు రెఫెర్ చేస్తే తనకు అక్కడా అలాంటి అనుభవమే ఎదురైందని వాపోయింది. నైట్ డ్యూటీకి వచ్చిన వైద్యులు తన భర్తను పట్టించుకునే వారే కాదని, తాను, తన సోదరి కలిసి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా
ఆక్సిజన్ ఇవ్వలేదని కన్నీళ్లు పెట్టుకుంది. పాట్నాలోని రాజేశ్వర్ ఆసుపత్రి సిబ్బంది అయితే తన
భర్త ఆక్సిజన్ స్థాయులు పడిపోతున్నా పట్టించుకోలేదని
ఆక్సిజన్ సరఫరాను నిలిపివేసి బ్లాక్
మార్కెట్ నుంచి కొని తెచ్చుకోమన్నారని వాపోయింది. ఈలోపు పరిస్థితి విషమించడంతో తన
భర్త చనిపోయాడని కన్నీరుమున్నీరయ్యింది.ఇక దీని గురించి తెలిసిన అధికారులు విచారణ జరిపి
జ్యోతి కుమార్ను సస్పెండ్ చేశారు.