ఈ తుఫాన్కు తౌక్టే అని పేరు పెట్టారు. ఒకవేళ ఇది భారత తీరాన్ని తాకితే ఈ ఏడాది దేశంలో ఇదే మొదటి తుఫాన్ అవుతుందన్నారు. దీని ప్రభావంతో కేరళ, లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కాబట్టి ఈ రాష్ట్రాల్లోని తీర ప్రాంతాల్లో మత్స్యకారులు ఈ నెల 14 నుంచి సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. తుఫాన్ ప్రభావంతో మాల్దీవులు, లక్షద్వీప్లలో గంటకు 60కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే సూచనలు కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే వారాంతంలో ఇక్కడి సముద్రంలో ఒక మీటరు ఎత్తులో అలలు ఎగసిపడే అవకాశం ఉందని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అవసరమైతే తప్పా ఎవ్వరూ బయటకు రావొద్దని సూచించింది. తెలంగాణలోనూ కొన్ని ప్రాంతాల్లో వర్షం పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ తుఫాన్కు తౌక్టే అని పేరు పెట్టారు. ఒకవేళ ఇది భారత తీరాన్ని తాకితే ఈ ఏడాది దేశంలో ఇదే మొదటి తుఫాన్ అవుతుందన్నారు. దీని ప్రభావంతో కేరళ, లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కాబట్టి ఈ రాష్ట్రాల్లోని తీర ప్రాంతాల్లో మత్స్యకారులు ఈ నెల 14 నుంచి సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. తుఫాన్ ప్రభావంతో మాల్దీవులు, లక్షద్వీప్లలో గంటకు 60కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే సూచనలు కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే వారాంతంలో ఇక్కడి సముద్రంలో ఒక మీటరు ఎత్తులో అలలు ఎగసిపడే అవకాశం ఉందని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అవసరమైతే తప్పా ఎవ్వరూ బయటకు రావొద్దని సూచించింది. తెలంగాణలోనూ కొన్ని ప్రాంతాల్లో వర్షం పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.