దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వైరస్ ని అరికట్టేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చూస్తూనే ఉన్నారు. ఈ మహమ్మారి రోజురోజుకు తన రూపాంతరని అభివృద్ధి చేసుకుంటూ ఉంది. ఇక మహమ్మారిని సమర్ధవంతగా అరికట్టేందుకు ఒక కొత్త టీకా సమర్థంగా పనిచేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే అన్ని ర‌కాల క‌రోనా వేరియంట్ ల‌కు చెక్ పెట్టేలా అమెరికాకు చెందిన శాస్త్ర‌వేత్తలు టీకాను అభివృద్ధి చేశారు. ఈ టీకాను డ్యూక్ యూనివ‌ర్సిటీ హ్యూమ‌న్ వ్యాక్సిన్ ఇనిస్టిట్యూట్ కు చెందిన బార్ట‌న్ ఎఫ్ హేన్స్ నేత్రుత్వంలోని శాస్త్ర‌వేత్త‌ల బృదం అభివృద్ది చేసింది.

అయితే కరోనా వైరస్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌ మానవ కణాల్లో గ్రాహకాలకు అనుసంధానం కావడం ద్వారా ఇన్‌ఫెక్షన్‌ను కలిగిస్తుంది. ఈ ప్రొటీన్‌పై ఉండే ‘రెసెప్టార్‌ బైండింగ్‌ డొమైన్‌’పై శాస్త్రవేత్తలు దృష్టిసారించారు. అయితే మానవుల్లోకి ప్రవేశించడానికి ఈ భాగం వైరస్‌కు సాయపడుతుంది. ఇక అదే సమయంలో యాంటీబాడీలకు సహకరించి, సదరు వైరస్‌ను నిర్వీర్యం చేయడంలో కీలకంగా పనిచేస్తుంది. ఈ ‘రెసెప్టార్‌ బైండింగ్‌ డొమైన్‌’లోని ఒక నిర్దిష్ట భాగాన్ని లక్ష్యంగా చేసుకొని యాంటీబాడీలు సులువుగా వైరస్‌పై దాడి చేయగలుగుతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో అచ్చంగా ఆ భాగాన్ని అనుకరించే ఒక నానోరేణువును డిజైన్‌ చేశారు.

ఇక శరీర రోగ నిరోధక స్పందనను మరింత పెంచేందుకు పటికతో తయారైన ఒక పదార్థాన్ని ఈ రేణువుకు జోడించారు. అయితే దీన్ని కోతుల్లోకి ఎక్కించినప్పుడు కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ను ఇది వంద శాతం నిలువరించినట్లు గుర్తించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు, వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ ద్వారా శరీరంలో ఉత్పత్తయ్యే యాంటీబాడీల కన్నా ఎక్కువగా ఇది ఉత్పత్తి చేసిందని తేల్చారు. రెసెప్టార్‌ బైండింగ్‌ డొమైన్‌లోని సదరు భాగాన్ని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా కరోనాలోని కొత్త రకాలు, గబ్బిలాల్లోని సార్స్‌ సంబంధ వైరస్‌లనూ యాంటీబాడీలతో నిర్వీర్యం చేయవచ్చని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: