ఇండియా ప్రస్తుతం కరోనా మహమ్మారితో సతమతం అవుతుంది. రోజుకి దేశంలో ఎన్నో లక్షల కేసులు నమోదవుతున్నాయి. రోజుకి చాలా మరణాలు నమోదవుతున్నాయి.చాప కింద నీరులాగా కరోనా వ్యాప్తి చెందుతుందే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు.ఇక మహా రాష్ట్రలో కూడా కేసులు రోజు రోజుకి తెగ పెరిగిపోతున్నాయి. రికార్డు స్థాయిలో కరోనా మహమ్మారి కేసులు నమోదవుతున్నాయి.మహారాష్ట్ర ప్రభుత్వం వైఖరి చాలా విచిత్రంగా వుంది. ఓ పక్క కరోనా విజృంభిస్తున్న వేళ తమకు తమ ప్రజలను కాపాడుకోవడానికి వ్యాక్సిన్ లు కావాలని చెప్పే ప్రభుత్వం ఇప్పుడు టీకా తయారీ సంస్థ బయోవిట్ ప్రైవేట్ లిమిటెడ్ కి టీకాలు తయారు చేసేందుకు అనుమతి ఇవ్వలేదు. ఇక ఈ నేపథ్యంలో ఈ సంస్థ పర్మిషన్ కొరకు ముంబై హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఇక హైకోర్టు కూడా బయోవిట్ ప్రైవేట్ లిమిటెడ్ టీకా తయారీ సంస్థకు అనుకూలంగా స్పందించింది.భారతీయ బయోటెక్ యొక్క అసోసియేట్ సంస్థ బయోవిట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు టీకా తయారీని ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న వాటిని స్వాధీనం చేసుకోవడానికి బొంబాయి హైకోర్టు అనుమతించింది.


జస్టిస్ కె కె టేటెడ్ మరియు ఎన్ ఆర్ బోర్కర్ డివిజన్ బెంచ్ అటవీ శాఖ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పిటిషన్లో బయోవిట్ తాత్కాలిక దరఖాస్తును అనుమతించింది.ఉత్పాదక యూనిట్‌ను ఆపరేట్ చేయడానికి మరియు ఉపయోగించడానికి అనుమతిస్తే ఈక్విటీలను తమకు అనుకూలంగా క్లెయిమ్ చేయవద్దని వారు చేపట్టిన తర్వాత బయోవిట్  విజ్ఞప్తి అనుమతించబడింది.ఇక మహారాష్ట్ర తాజా కేసులు చూసినట్లయితే మహారాష్ట్రలో రోజువారీ కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య మంగళవారం 40,000 పైన 40,956 కు పెరిగింది. మహారాష్ట్ర మొత్తం కేసులు  ఇప్పుడు 51,79,929 వద్ద ఉండగా, 793 మరణాలు 77,191 మందిని పెంచినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.ఇక వీలైనంత త్వరగా టీకాలు తయారు చేసి ప్రజలకు వెయ్యాలని ముంబై హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: