అనుమతి పత్రాలతో పాటు సంబంధిత ఆసుపత్రి ల్యాండ్ లైన్ నుంచి ఫోన్లో తమతో మాట్లాడిస్తేనే వదులుతున్నారని రోగి బంధువులు ఆందోళన చెందుతున్నారు. కొందరికైతే వెంటనే ఫోన్లు రావడంతో వదులుతున్నారు. మరికొందరికి ఫోన్ రావడం ఆలస్యమవుతోంది. దాంతో పోలీసులు, రోగి బంధువులు వాగ్వాదానికి దిగుతున్నారు. కొందరికైతే గంటల తరబడీ సరిహద్దుల్లోనే నిలిపేస్తున్నారు. ప్రయాణ సమయాన్ని అంచనా వేసుకుని సరిపడేంత ఆక్సిజన్ నింపుకుని వస్తున్న రోగులకు ఇది శాపంగా మారుతోంది. ఒక వేళ ఆక్సిజన్ అయిపోతే వారి పరిస్థితి ఏంటని మరికొందరు వాదిస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం వద్ద ఇదే పరిస్థితి ఎదురైంది. అటు వాడపల్లి కృష్ణానది వంతెన చెక్ పోస్టు వద్ద కూడా ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్లను నిలిపివేస్తున్నారు. రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో చేరేందుకు ముందస్తు అనుమతి ఉన్న వాహనాల్నే అనుమతించారు. దీంతో కరోనా రోగి బంధువులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఇకనైనా మారాలని, కరోనా రోగుల కోసం ఆంక్షలను సరిచేయాలని వారు కోరుతున్నారు. దీనిపై సర్కార్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.
అనుమతి పత్రాలతో పాటు సంబంధిత ఆసుపత్రి ల్యాండ్ లైన్ నుంచి ఫోన్లో తమతో మాట్లాడిస్తేనే వదులుతున్నారని రోగి బంధువులు ఆందోళన చెందుతున్నారు. కొందరికైతే వెంటనే ఫోన్లు రావడంతో వదులుతున్నారు. మరికొందరికి ఫోన్ రావడం ఆలస్యమవుతోంది. దాంతో పోలీసులు, రోగి బంధువులు వాగ్వాదానికి దిగుతున్నారు. కొందరికైతే గంటల తరబడీ సరిహద్దుల్లోనే నిలిపేస్తున్నారు. ప్రయాణ సమయాన్ని అంచనా వేసుకుని సరిపడేంత ఆక్సిజన్ నింపుకుని వస్తున్న రోగులకు ఇది శాపంగా మారుతోంది. ఒక వేళ ఆక్సిజన్ అయిపోతే వారి పరిస్థితి ఏంటని మరికొందరు వాదిస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం వద్ద ఇదే పరిస్థితి ఎదురైంది. అటు వాడపల్లి కృష్ణానది వంతెన చెక్ పోస్టు వద్ద కూడా ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్లను నిలిపివేస్తున్నారు. రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో చేరేందుకు ముందస్తు అనుమతి ఉన్న వాహనాల్నే అనుమతించారు. దీంతో కరోనా రోగి బంధువులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఇకనైనా మారాలని, కరోనా రోగుల కోసం ఆంక్షలను సరిచేయాలని వారు కోరుతున్నారు. దీనిపై సర్కార్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.