ఈ మధ్యకాలంలో బంధాలకు బంధుత్వాలకు అసలు విలువ లేకుండా పోతుంది. ఒకప్పుడైతే తమ సొంత వాళ్లు పక్కన ఉన్నారు అంటే కొండంత బలం గా భావించే వారు అందరు. కానీ ఇప్పటి రోజుల్లో మాత్రం సొంత వాళ్ళు పక్కన ఉన్న ఏ క్షణం లో ప్రాణాలు పోతాయో అనే భయంతోనే బ్రతుకుతున్నారు.  ఇక ఏకంగా సొంత వాళ్లే యమకింకరులుగా మారిపోయి ప్రాణాలు తీస్తున్న ఘటనలు కూడా ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.  నేటి రోజుల్లో మానవ బంధాల విలువ లేదు అని చెప్పడానికి ఈ మధ్యకాలంలో వెలుగులోకి వస్తున్న ఎన్నో ఘటనలు నిదర్శనంగా మారిపోతున్నాయి అని చెప్పాలి.


 ఇక్కడ ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది నవమాసాలు మోసి పెంచి ఆలనా పాలనా చూసి ఎంతో ప్రేమను పంచిన ఆ తల్లి విషయంలో కూతురే ఏకంగా మృత్య శకటంగా మారిపోయింది. ప్రియుడి మోజులో పడి పోయిన కూతురు తల్లిని చంపేందుకు కూడా వెనకాడలేదు నిద్రలో ఉన్న తల్లిని దారుణంగా చంపేసింది. ఈ దారుణ ఘటన విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో చోటుచేసుకుంది ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి కటకటాల్లోకి పంపారు.



 40 ఏళ్ల లక్ష్మి అనే మహిళ ఇటీవలి అకస్మాత్తుగా మృతి చెందడంతో ఇక అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే కూతురి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపారు. అయితే గత కొన్ని రోజుల క్రితమే ప్రియుడు వరుణ్ సాయి తో పెళ్లి చేయాలి అంటూ కూతురు రూపా శ్రీ తల్లిని కోరింది.  అయితే తల్లి మాత్రం ప్రియుడితో పెళ్లి చేసేందుకు నిరాకరించింది. దీంతో ప్రియుడి మోజులో పడిపోయిన సదరు యువతి ఏకంగా దిండుతో అదిమిపెట్టి తల్లిని చంపేందుకు ప్రయత్నం చేసింది. ఇక చనిపోయింది అని నిర్ధారించుకున్న తర్వాత ప్రియుడితో వెళ్లి పోయింది ఆ తర్వాత తల్లి మంచం పైనుంచి కింద పడి చనిపోయింది అంటూ కొత్త నాటకానికి తెర లేపింది ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి సదరు మృతురాలి కూతురుతో పాటు ఆమె ప్రియుడుని కూడా అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: