ప్ర‌ముఖ తమిళ దర్శ‌కుడు శంక‌ర్ పై నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్ మ‌ద్రాస్ హై కోర్టుకు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఇంయ‌న్ 2 సినిమాకు ఇప్ప‌టికే తాము సగం వ‌ర‌కు బ‌డ్జెట్ ఖ‌ర్చు చేశామ‌ని కానీ ఇప్పుడు శంక‌ర్ సినిమాను ఆపేయ‌డం వ‌ల్ల తాము తీవ్రంగా న‌ష్ట‌పోయామని లైకా ప్రొడ‌క్ష‌న్స్ కోర్టును ఆశ్ర‌యించింది. అంతే కాకుండా ప్ర‌స్తుతం శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న సినిమాల షూటింగ్ కు కూడా బ్రేకులు వేయాల‌ని కోరింది. అయితే కోర్టు ఈ కేసును కొట్టివేసిన‌ట్టు తెలుస్తోంది. తాజాగా ద‌ర్శ‌కుడు శంక‌ర్ ఈ వివాదంపై స్పందించారు. మొద‌ట సినిమాలో హీరోగా న‌టిస్తున్న క‌మ‌ల్ హాస‌న్ కు మేక‌ప్ వ‌ల్ల ఎల‌ర్జీ రావ‌డంతో సినిమా షూటింగ్ కు బ్రేక్ ప‌డింద‌ని అన్నారు. ఆ త‌ర‌వాత క్రేన్ ప్ర‌మాదం జ‌రిగింద‌ని...ఆ వెంట‌నే కోవిడ్ ఉదృతి మొద‌లైంద‌ని చెప్పారు. షూటింగ్ ఆల‌స్యం అయితే దానికి త‌న‌ను నిందించ‌డం క‌రెక్ట్ కాద‌ని అన్నారు. అయితే ఇటీవ‌ల త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలైన క‌మ‌ల్ హాస‌న్ శంక‌ర్, లైకా ప్రొడ‌క్షన్స్ మ‌ధ్య నెల‌కొన్న సమ‌స్య‌ను స్నేహ పూర్వ‌కంగా ప‌రిష్క‌రించాల‌ని అనుకుంటున్న‌ట్టు తెలుస్తుంది.

ఈ సినిమాను త్వ‌ర‌గా పూర్తి చేసి క‌మల్ త‌న ఫ్యూచ‌ర్ ప్రాజెక్టుల‌ను మొద‌లు పెట్టాల‌ని భావిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా శంకర్ ఈ వివిదంతో పాటు మ‌రో వివాదంలోనూ చిక్కుకున్నారు. బాలీవుడ్ హీరో ర‌న్వీర్ సింగ్ తో శంక‌ర్ అప‌రిచితుడు సినిమా రీమేక్ ను అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా క‌థ‌పై ఎలాంటి హ‌క్కులు శంక‌ర్ కు లేవ‌ని ఈ క‌థ పై పూర్తి హ‌క్కులు తానే క‌లిగి ఉన్నాన‌ని ఆస్కార్ ర‌విచంద్ర‌న్ ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా శంక‌ర్ త‌న‌కు చెప్ప‌కుండా త‌న క‌థ‌తో సినిమా తీయాల‌నుకోవ‌డం న‌మ్మ‌క ద్రోహ‌మ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. ఇది ఇలా ఉంటే శంకర్ ప్ర‌స్తుతం మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్ తో ఓ భారీ బ‌డ్జెట్ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నాడు. దీనికి దిల్ రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హరిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వ‌చ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: