ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టే షన్ కి వెళ్లిన వారిపైనే తప్పుడు కేసులు పెట్టి ప్రజలకు పోలీసులు ఏం సందేశమిస్తున్నారు? అని ఈ సందర్భంగా నిలదీశారు. ఇలా అయితే సామాన్య బాధితులు పోలీసు స్టేషన్ కి రావాలంటేనే భయపడతారు అని ఆయన విమర్శించారు. పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యహహరిస్తూ వైసీపీ నేతలకు ఒక చట్టం, ప్రతిపక్ష నేతలకు మరో చట్టం అనుసరిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. వైసీపీ నేతలు చెప్పినట్లు ఆడుతూ టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులపై ముందు రోజుల్లో చర్యలు తప్పవు అని ఆయన హెచ్చరించారు.
టీడీపీ నేతలపై నమోదు చేసిన తప్పుడు కేసులు వెంటనే ఎత్తివేయాలి అని ఈ సందర్భంగా డిమాండ్ చేసారు. ఇక ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడు కరోనా కొత్త వేరియంట్ కి సంబంధించి చేసిన వ్యాఖ్యల తర్వాత ఆయన కర్నూలు లో కేసు నమోదు అయింది. తప్పుడు ప్రచారం వ్యాప్తి చేస్తున్నారు అనే కారణంతో చంద్రబాబు నాయుడు పై కేసు నమోదు చేసారు. ఆ తర్వాత వెంటనే టీడీపీ నేతలు అదే స్టేషన్ కి వెళ్లి కేసు నమోదు చేసారు. ఇక మొన్న గుంటూరు లో కేసు నమోదు చేసారు. ఆ తర్వాత టీడీపీ నేతలు కూడా కేసు నమోదు చేసారు.