రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసులకంటే ప్రతిపక్ష నేతలపై నమోదవుతున్న అక్రమ కేసులే ఎక్కువ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. వైసీపీ  ప్రభుత్వం ప్రతిపక్షాన్ని అణచి వెయ్యడానికి చూపిస్తున్న పట్టుదల ప్రజల ప్రాణాలను బలితీసుకొంటున్న కరోనా కట్టడి పై చూపడం లేదు అని ఆయన మండిపడ్డారు. మంత్రి సీదిరి అప్పలరాజుపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన టీడీపీ నేతలు తెనాలి శ్రావణ్ కుమార్, కోవెలమూడి రవీంద్ర, ఇతర టీడీపీ నేతలపై గుంటూరు పోలీసులు తప్పుడు కేసు నమోదు చేయడాన్ని ఖండిస్తున్నాo అని ఆయన వ్యాఖ్యానించారు.

ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టే షన్ కి వెళ్లిన వారిపైనే తప్పుడు  కేసులు పెట్టి ప్రజలకు పోలీసులు ఏం సందేశమిస్తున్నారు? అని ఈ సందర్భంగా నిలదీశారు. ఇలా అయితే సామాన్య బాధితులు పోలీసు స్టేషన్ కి రావాలంటేనే భయపడతారు అని ఆయన విమర్శించారు. పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యహహరిస్తూ వైసీపీ నేతలకు ఒక చట్టం, ప్రతిపక్ష నేతలకు మరో చట్టం అనుసరిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. వైసీపీ నేతలు చెప్పినట్లు ఆడుతూ టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులపై  ముందు రోజుల్లో చర్యలు తప్పవు అని ఆయన హెచ్చరించారు.

టీడీపీ నేతలపై  నమోదు చేసిన తప్పుడు కేసులు వెంటనే ఎత్తివేయాలి అని ఈ సందర్భంగా డిమాండ్ చేసారు. ఇక ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడు కరోనా కొత్త వేరియంట్ కి సంబంధించి చేసిన వ్యాఖ్యల తర్వాత ఆయన కర్నూలు లో కేసు నమోదు అయింది. తప్పుడు ప్రచారం వ్యాప్తి చేస్తున్నారు అనే కారణంతో చంద్రబాబు నాయుడు పై కేసు నమోదు చేసారు. ఆ తర్వాత వెంటనే టీడీపీ నేతలు అదే స్టేషన్ కి వెళ్లి కేసు నమోదు చేసారు. ఇక మొన్న గుంటూరు లో కేసు నమోదు చేసారు. ఆ తర్వాత టీడీపీ నేతలు కూడా కేసు నమోదు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: