ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక వ్యక్తిని విషం కక్కే పాములే ఏం చేయలేక పోయాయి కానీ కనిపించని శత్రువు కరోనా కాటేసింది. సాధారణంగా పాము కనిపించింది అంటే అందరూ భయంతో ఊగిపోతారు. లేదంటే కర్రతో కొట్టి చంపేస్తారు. కానీ ఇక్కడ ఉన్న వ్యక్తి మాత్రం ఎన్నో పాములు పట్టుకుని వాటిని అటవీ సిబ్బందికి అప్పజేబుతూ ఉంటాడు. ఇప్పటివరకు ఏకంగా పది వేలు పాముల వరకు పట్టుకొని అటవీ సిబ్బందికి అప్పగించాడు. అయితే ఇలా విష సర్పాలు అతన్ని ఏమీ చేయలేక పోయాయి గానీ అటు కరోనా మహమ్మారి మాత్రం కాటేసింది చివరికి ప్రాణాలు తీసింది.
ఈ విషాదకర ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. స్టాన్లీ ఫెర్నాండెజ్ అనే 62 ఏళ్ల వ్యక్తి చెన్నై లోని కోయంబత్తూరులో నివసిస్తూ ఉండేవాడు. అయితే ఇక 25 ఏళ్ల నుంచి స్నేక్ క్యాచర్ గా స్థానిక ప్రజలందరికీ ఎంతగానో సేవలు అందిస్తున్నాడు. కార్యాలయాలు ఇళ్లల్లో దూరిన పాము లు పట్టుకుని అటవీ సిబ్బందికి అప్పగించేవాడు. ఇప్పటి వరకు ఎంతో విషపూరితమైన పాములు కూడా ఎంతో సులభంగా పట్టుకున్నాడు. ఏకంగా పది వేల పాముల వరకు పట్టుకున్నాడు. అయితే ఇటీవల ఐదు రోజుల క్రితం కరోనా వైరస్ బారిన పడ్డాడు. ఈ క్రమంలోనే కరోనా వైరస్ తో పోరాడుతూ పరిస్థితి విషమించి చివరకు మృత్యువాత పడ్డాడు.ఇలా విషం కక్కే పాములు అతన్ని ఏమీ చేయలేక పోయాయి కానీ కనిపించని కరోనా మాత్రం చంపేసింది.