తమ విచారణలో ఆయన కొన్ని ఛానళ్ళతో, కొన్ని సోషల్ మీడియా గ్రూపులతో కుట్రపన్ని తద్వారా సామాజిక అశాంతిని రేకెత్తించడం కోసం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకరకమైన కుట్ర చేస్తున్నారని తేలినట్లు సీఐడీ అధికారులు చెప్పారు. అయితే ఈ కేసులో భాగంగా రఘురామ కృష్ణం రాజుకు బెయిల్ కావాలని ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ న్యాయస్థానం ఆ పిటీషన్ను కొట్టివేసింది. ముందు సీఐడీ కోర్టును ఆశ్రయించమని న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు.
అయితే రఘురామ తరపు న్యాయవాదులు తాజాగా వేసినటువంటి పిటిషన్ నేపథ్యంలో ఆయన కేసును ప్రత్యేక డివిజన్ బెంచ్ విచారించనుంది. జస్టిస్ ప్రవీణ్ నేతృత్వంలో ఈ స్పెషల్ డివిజన్ బెంచ్ ఏర్పాటు కానుంది. ఈ బెంచ్ ఏర్పాటయిన తరువాత ఈ కేసు విచారణ జరగనుంది. అయితే రఘురామకు గాయాలు మానే వరకు ఆసుపత్రిలో ఉంచాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా అతడికి ఉన్న వై-క్యాటగిరీ భద్రతా సిబ్బంది రాఘురామతోనే ఉంటుందని తెలిపింది.