వైఎస్ జగన్మోహనరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ ఇపుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఉంది. నెల రోజుల క్రితం రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు జగన్ బెయిల్ ని రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిని విచారణకు స్వీకరించిన కోర్టు జగన్ కి సీబీఐ కి కూడా నోటీసులు జారీ చేసింది.

దీని మీద ఈ మొదటి సారి ఈ నెల 7న విచారణ జరగగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేసేందుకు తమకు సమయం కావాలని అటు జగన్ తరఫున న్యాయ వాదులు, ఇటు సీబీఐ న్యాయవాదులు కూడా కోరారు. దానికి అంగీకరించిన కోర్టు ఈ నెల 17 వరకూ టైమ్  ఇచ్చింది. ఈ రోజు కూడా మరికొంత టైమ్ కావాలి కోరడడంతో ఈ నెల 26కు కోర్టు కేసును వాయిదా వేసింది. ఈ సందర్భంగా సీబీఐ కోర్టు చేసిన వ్యాఖ్యలు కీలకంగా  ఉన్నాయి. కౌంటర్ దాఖలు చేసేందుకు ఇదే ఆఖరి ఆవకాశమని కూడా కోర్టు పేర్కొంది.

దాంతో ఈ నెల 26న ఏం జరగబోతోంది. అసలు కౌంటర్ దాఖలు చేయడానికి ఏ అంశాలను ప్రస్థావనకు తెస్తారు అన్నదే చర్చగా ఉంది. మొత్తానికి చూసుకుంటే జగన్ బెయిల్ రద్దు పిటిషన్ ఇపుడు ఏపీలో హాట్ హాట్ టాపిక్ గా ఉంది. మరో వైపు పిటిషన్ దాఖలు చేసిన రఘురామ క్రిష్ణం రాజును ఇపుడు ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. దాంతో ఈ రెండు అంశాలు కూడా వేడిని రాజేస్తున్నాయి. మరో వైపు రాజు అరెస్ట్ వేళ విపక్షం అతిగా స్పందించడంతో పాటు తెలుగుదేశం పార్టీ అయితే వైసీపీ సర్కార్ మీద విరుచుకుపడింది.

ఈ నేపధ్యంలో రాజు జగన్ బెయిల్ రద్దు కోరుతూ వేసిన పిటిషన్ వెనక ఎవరు ఉన్నారు అన్న చర్చ కూడా ఆసక్తికరంగా సాగుతోంది. మొత్తానికి చూస్తే రాజు అరెస్ట్ విషయంలో విపక్షాలు హడావుడి చేయడంతో ఇపుడు జగన్ బెయిల్ రద్దు పిటిషన్ వెనక కూడా రాజకీయ కుట్ర ఏమైనా ఉందా అన్న  అనుమానాలు కూడా పెరుగుతున్నాయి. మరి  ఈ నెల 26న ఏం
జరుగుతుంది అన్నది చూడాలి.
 







మరింత సమాచారం తెలుసుకోండి: