ఈవిడ చెప్పే సూక్తుల ప్రకారం ఇక కోవాగ్జిన్లు కోవిషీల్డ్లు, రెమ్డెసివిర్లు ఏవీ అక్కర లేదు. కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు గోమూత్రం తాగితే చాలట. అదీ దేశీ గోమూత్రం అయితేనే ఫలితాలు ఉంటాయని మరచిపోకూడదు మరి. మధ్యప్రదేశ్కు చెందిన ఎంపీ ప్రగ్యా ఠాకూర్ ఇచ్చిన సలహా ఇది. అంతేకాదు.. తాను రోజూ గోమూత్రం తీసుకుంటానని, అందుకే కరోనా ఇంతవరకు తన దరి జేరలేదని కూడా సెలవిచ్చారీవిడ. ఈ మాటలు నమ్మే మూఢభక్తుల సంఖ్య ఏమాత్రమో తెలియదుగానీ, ఇంత గొప్ప విషయం మన వైద్యనిపుణులకు, ప్రభుత్వాలకు ఇంకా తెలియకపోవడం ఆశ్యర్యమే కదామరి. రోజూ గోమూత్రం తాగితే కరోనా వల్ల ఊపిరి తిత్తుల్లో ఏర్పడ్డ జబ్బు నయమైపోతుందని, గోమూత్రం అపర సంజీవనిలా పని చేస్తుందని ఆమె నొక్కి చెప్పడాన్ని జనం ఎలా అర్థం చేసుకోవాలో ఆలోచించాల్సిందే. ఈ ప్రచారం ఈవిడ ఇప్పుడే మొదలుపెట్టారనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. గోమూత్రంతో మరికొన్ని గోపదార్థాలు కలిపి సేవిస్తే తనకు కేన్సర్ తగ్గిందని రెండేళ్ల క్రితమే ప్రగ్య ప్రకటించారు. 2020 డిసెంబర్ లో కోవిడ్ లక్షణాలతో ఆమె ఢిల్లీ ఎయిమ్స్లో చేరి చికిత్స కూడా తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఇలాంటి మూర్ఖపు ప్రచారాలను ఏ రాజకీయ ప్రయోజనాలను ఆశించి వీరు చేస్తున్నారోగానీ, వీటిని నమ్మితే ప్రజలు ప్రాణాలు కోల్పోవడం మాత్రం ఖాయమని పలువురు విమర్శిస్తున్నారు. ఇలాంటి విషయాలను నమ్మి ఆచరణలో పెట్టి ప్రాణాల మీదకు తెచ్చుకోవగద్దని డాక్టర్లు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. కోవిడ్-19కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని గోమూత్రం, పేడ అందిస్తాయని ఎక్కడా రుజువు కాలేదని ఐఎంఏ అధిపతి డాక్టర్ జేఏ జయలాల్ ఇప్పటికే ప్రకటించారు.
ఈవిడ చెప్పే సూక్తుల ప్రకారం ఇక కోవాగ్జిన్లు కోవిషీల్డ్లు, రెమ్డెసివిర్లు ఏవీ అక్కర లేదు. కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు గోమూత్రం తాగితే చాలట. అదీ దేశీ గోమూత్రం అయితేనే ఫలితాలు ఉంటాయని మరచిపోకూడదు మరి. మధ్యప్రదేశ్కు చెందిన ఎంపీ ప్రగ్యా ఠాకూర్ ఇచ్చిన సలహా ఇది. అంతేకాదు.. తాను రోజూ గోమూత్రం తీసుకుంటానని, అందుకే కరోనా ఇంతవరకు తన దరి జేరలేదని కూడా సెలవిచ్చారీవిడ. ఈ మాటలు నమ్మే మూఢభక్తుల సంఖ్య ఏమాత్రమో తెలియదుగానీ, ఇంత గొప్ప విషయం మన వైద్యనిపుణులకు, ప్రభుత్వాలకు ఇంకా తెలియకపోవడం ఆశ్యర్యమే కదామరి. రోజూ గోమూత్రం తాగితే కరోనా వల్ల ఊపిరి తిత్తుల్లో ఏర్పడ్డ జబ్బు నయమైపోతుందని, గోమూత్రం అపర సంజీవనిలా పని చేస్తుందని ఆమె నొక్కి చెప్పడాన్ని జనం ఎలా అర్థం చేసుకోవాలో ఆలోచించాల్సిందే. ఈ ప్రచారం ఈవిడ ఇప్పుడే మొదలుపెట్టారనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. గోమూత్రంతో మరికొన్ని గోపదార్థాలు కలిపి సేవిస్తే తనకు కేన్సర్ తగ్గిందని రెండేళ్ల క్రితమే ప్రగ్య ప్రకటించారు. 2020 డిసెంబర్ లో కోవిడ్ లక్షణాలతో ఆమె ఢిల్లీ ఎయిమ్స్లో చేరి చికిత్స కూడా తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఇలాంటి మూర్ఖపు ప్రచారాలను ఏ రాజకీయ ప్రయోజనాలను ఆశించి వీరు చేస్తున్నారోగానీ, వీటిని నమ్మితే ప్రజలు ప్రాణాలు కోల్పోవడం మాత్రం ఖాయమని పలువురు విమర్శిస్తున్నారు. ఇలాంటి విషయాలను నమ్మి ఆచరణలో పెట్టి ప్రాణాల మీదకు తెచ్చుకోవగద్దని డాక్టర్లు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. కోవిడ్-19కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని గోమూత్రం, పేడ అందిస్తాయని ఎక్కడా రుజువు కాలేదని ఐఎంఏ అధిపతి డాక్టర్ జేఏ జయలాల్ ఇప్పటికే ప్రకటించారు.